యాప్నగరం

Pawan Kalyan మళ్లీ రంగంలోకి.. విశాఖ నుంచి జనసేన పోరాటం షురూ!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు. భవన నిర్మాణ రంగ కార్మికులకు మద్దతుగా ఈ ర్యాలీని చేపట్టనున్నారు.

Samayam Telugu 20 Oct 2019, 5:47 pm
పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ విశాఖపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించనుంది. ఇసుక కొరత వల్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. దీంతో భవన నిర్మాణ రంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ అంశాన్ని హైలెట్ చేయడం కోసం నవంబర్‌ 3న ర్యాలీ నిర్వహించాలని జనసేన నిర్ణయించింది. రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఉపాధి లభించకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు.. వారికి మద్దతుగా పవన్ కళ్యాణ్ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారని జనసేన పార్టీ తెలిపింది.
Samayam Telugu pk1


భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా నవంబర్ 3న మధ్యాహ్నం 3 గంటలకు పవన్ కళ్యాణ్ ర్యాలీని ప్రారంభిస్తారు. ర్యాలీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది స్థానికులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని జనసేన తెలిపింది. మంగళగిరిలో జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఉదయం ప్రారంభమైన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించారు.

విశాఖ నగరంలో భారీగా నిర్మాణాలు జరుగుతుంటాయి. ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి భారీ సంఖ్యలో వలస కార్మికులు ఇక్కడ పని చేస్తుంటారు. దీంతో విశాఖ వేదికగా ర్యాలీ చేపట్టాలని జనసేన నిర్ణయించిందని భావిస్తున్నారు. అదీగాకుండా.. ఈ జిల్లాలో జనసేనకు పట్టుంది. ఒక్క సీటైనా గెలవకపోయినప్పటికీ.. విశాఖ లోక్‌సభ స్థానం నుంచి జేడీ లక్ష్మీనారాయణ గట్టి పోటీ ఇచ్చారు. గాజువాకలో జనసేనాని పోరాడి ఓడారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.