యాప్నగరం

ఆ విషయంలో దక్షిణ భారత్‌లోనే జనసేన నంబర్ 1.. పవన్ కళ్యాణ్ స్పెషల్ ట్వీట్

Jana Sena: జనసేనకు ట్విట్టర్‌లో మిలియన్ ఫాలోవర్లు దాటడంపై పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. దక్షిణాదిలో ట్విట్టర్‌లో మిలియన్ మార్క్ దాటిన ఏకైక ప్రాంతీయ పార్టీ జనసేనే అని పేర్కొన్నారు.

Samayam Telugu 27 Apr 2020, 11:53 pm
జనసేన పార్టీ అరుదైన ఘనత సాధించింది. దక్షిణ భారతదేశంలో ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన ప్రాంతీయ పార్టీలు పొందలేని ఫీట్‌ను సాధించింది. ట్విట్టర్‌లో మిలియన్ (10 లక్షల) మంది ఫాలోవర్లను సాధించింది. దక్షిణాదిలో ఏ ప్రాంతీయ పార్టీ సాధించలేని ఘనతను జనసేన పొందిందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఆయన వరుస ట్వీట్లు చేశారు.
Samayam Telugu జనసేన పార్టీ ట్విట్టర్ కవర్ ఫొటో


‘‘మిలియన్ ఫాలోవర్లను సాధించిన జనసేన పార్టీకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. పార్టీ కోసం ఎంతగానో పాటుపాడుతున్న జనసేన ట్విట్టర్ హ్యాండిల్ టీంకు శుభాభినందనలు. ఈ లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత మీ అందరినీ ఓ సారి కలుస్తాను.’’ అని పవన్ పేర్కొన్నారు.

‘‘ట్విట్టర్‌లో 10 లక్షల మంది జనసైనికులయ్యారు. దక్షిణ భారతదేశంలోనే మిలియన్ మార్క్‌ చేరిన ఏకైక ప్రాంతీయ పార్టీ జనసేన అని తెలిసింది. ఇందుకు జనసేన శతఘ్ని టీంకు, సోషల్ మీడియలో ఉన్న ప్రతి సైనికుడికి పేరుపేరునా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దేశం గర్వించేలా ఈ ఆర్మీని నిర్మిద్దాం’’ అని పవన్ పేర్కొన్నారు. కాగా, ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ట్విట్టర్ ఫాలోవర్లు 5.60 లక్షల మంది ఉండగా, టీడీపీకి 3.96 లక్షల మంది ఉన్నారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ట్విట్టర్‌లో 4.31 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. కానీ, గత ఎన్నికల్లో కేవలం ఒక్క ఎమ్మెల్యే స్థానం పొందిన జనసేన పార్టీ మాత్రం 10 లక్షల మంది ఫాలోవర్లను కలిగి ఉండటం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.