యాప్నగరం

ఎవరినీ వదలం.. నోటీసులకు సిద్ధంగా ఉండండి.. జనసేన హెచ్చరికలు

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు అమరావతి ప్రాంతంలో భారీగా భూములున్నట్లు ప్రచారం చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది.

Samayam Telugu 25 Jan 2020, 3:03 pm
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు అమరావతి ప్రాంతంలో 62 ఎకరాల భూములు కూడబెట్టినట్లు వస్తున్న వార్తలను ఆ పార్టీ ఖండించింది. జనసేనను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక నీచ బుద్దితో కొందరు ప్రజావ్యతిరేకులు కుట్రలు పన్నారని ఆరోపించింది. వారి అనుచరగణంతో వ్యతిరేక ప్రచారాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు జనసేన పార్టీ న్యాయ విభాగం కోఆర్డినేటర్ ఇవన సాంబశివ ప్రతాప్ ఓ ప్రకటన విడుదల చేశారు. దీన్ని జనసేన అధికార ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశారు.
Samayam Telugu Pawan Kalyan


అమరావతిలోనే రాజధాని ఉండాలని జనసేన పోరాటం చేస్తోందని సాంబశివ ప్రతాప్ తెలిపారు. ఈ ప్రజా పోరాటానికి కోట్లాది గొంతులు తోడు ఉండటంతో ప్రత్యర్థులు ఎదుర్కోలేకపోతున్నారని విమర్శించారు. అందుకే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు అమరావతి ప్రాంతంలో 62 ఎకరాల భూములు ఉన్నట్లు తప్పుడు పత్రాలు సృష్టించి గోబెల్స్ ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

వారిపై పరువునష్టం దావా..
తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై, సోషల్ మీడియాలో వక్రరాతలు రాస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. అలాగే ఈ ప్రచారానికి కారకులైన వారిపై పరువు నష్టం దావా వేయనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో వారందరికీ లీగల్ నోటీసులు పంపనున్నట్లు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.