యాప్నగరం

సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కుమారుడికి జగన్ సర్కార్ కీలక పదవి

ప్పటికే అదనపు ఏజీగా పొన్నవోలు సుధాకర్‌రెడ్డి సేవలు అందిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌(ఏఏజీ)గా జాస్తి నాగభూషణ్‌ నియమించింది.

Samayam Telugu 10 Dec 2020, 7:44 am
జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌(ఏఏజీ)గా జాస్తి నాగభూషణ్‌ నియమించింది. ఈ నియామకానికి సంబంధించి రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. నాగభూషణ్ సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ కుమారుడు.. ఆయన గత 18 ఏళ్లుగా హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఆయన గురువారం ఏఏజీగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అదనపు ఏజీగా పొన్నవోలు సుధాకర్‌రెడ్డి సేవలు అందిస్తున్నారు.
Samayam Telugu ఏఏజీగా నాగభూషణ్


నాగభూషణ్ గతంలో రాష్ట్ర ప్రభుత్వంపై వచ్చిన వివిధ ఆరోపణలపై జగన్‌ ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలిసి పలు నివేదికలు కూడా సమర్పించారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రితోపాటు ఢిల్లీకి వెళ్లినవారిలో జాస్తి నాగభూషణ్‌ కూడా ఉన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుమారుడు కావడంతో ఆయనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు అందరూ భావించారు. ఇప్పుడు నాగభూషణ్‌ను అదనపు అడ్వకేట్‌ జనరల్‌గా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు వచ్చాయి. ఇప్పుడు ఏపీకి ఇద్దరు ఏఏజీలు ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.