యాప్నగరం

అనంతపురం: పొలాల్లో ల్యాండైన విమానం.. తప్పిన ముప్పు

జెట్ విమానంలో సాంకేతిక లోపం.. పొలాల్లో అత్యవసరంగా దించేసిన పైలట్.. తప్పు పెను ప్రమాదం. విమానం పొలాల్లో దిగిందని తెలియడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు అక్కడికి తరలివచ్చారు.

Samayam Telugu 17 Feb 2020, 1:38 pm
అనంతపురం జిల్లాలో పొలాల్లో విమానం అత్యవసరంగా దిగింది. బ్రహ్మసముద్రం మండలం ఎరడికేర సమీపంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలంరేపింది. జెట్ విమానం కర్ణాటకలోని మైసూరు నుంచి బళ్లారి జిందల్‌ ఫ్యాక్టరీకి బయల్దేరింది. కానీ మార్గ మధ్యంలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ పొలాల్లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశాడు.
Samayam Telugu atp


పైలట్ సురక్షితంగా విమానాన్ని పొలాల్లోకి దించడం.. ఎవరికీ ఎలాంటి ముప్పు జరగలేదు.. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ జెట్‌లో పైలట్‌తో పాటూ మరో వ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విమానం జిల్లా సంస్థకు చెందినదిగా తెలుస్తోంది. విమానం పొలాల్లో దిగిందని తెలియడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు అక్కడికి తరలివచ్చారు. ఆ జెట్‌కు మరమ్మత్తులు చేసి అక్కడి నుంచి తరలించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.