యాప్నగరం

Tadepalle: సీఎం జగన్‌తో జోయాలుక్కాస్‌ ఛైర్మన్‌ అలుక్కాస్‌ వర్గిస్‌ జాయ్ భేటీ

Tadepalle: ప్రముఖ నగల వ్యాపార సంస్థ జోయాలుక్కాస్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అలుక్కాస్‌ వర్గిస్‌ జాయ్‌.. ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో వీరి భేటీ జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించినట్లు సమాచారం.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 20 Jan 2023, 7:29 pm

ప్రధానాంశాలు:

  • ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన జోయాలుక్కాస్‌ ఛైర్మన్‌
  • రాష్ట్రంలో పెట్టుబడులు, అవకాశాలపై ప్రధానంగా చర్చ
  • పారిశ్రామిక విధానాలను వివరించిన ముఖ్యమంత్రి జగన్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Joyalukas chairman meets YS Jagan
జగన్‌ను కలిసిన జోయాలుక్కాస్‌ ఛైర్మన్‌
Tadepalle: ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో.. జోయాలుక్కాస్‌ ఛైర్మన్‌ అలుక్కాస్‌ వర్గిస్‌ జాయ్ సమావేశమయ్యారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో వీరు భేటీ అయ్యారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు, అవకాశాలపై ఇరువురు చ‌ర్చించుకున్నారు. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా తాము సిద్దంగా ఉన్నామని.. సీఎం జ‌గ‌న్ (YS Jagan Mohan Reddy) స్పష్టం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న విధానాలను ముఖ్యమంత్రి వివ‌రించారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయ‌ని జగన్ వివరించారు. జోయాలుక్కాస్‌ సీవోవో హెన్రీ జార్జ్, రవిశంకర్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ కంది రవిశంకర్ కూడా జగన్‌తో జరిగిన భేటీ ఉన్నారు.
Read Latest Andhra Pradesh News and Telugu News
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.