యాప్నగరం

పీసీఏ చైర్మన్‌గా జస్టిస్ కనగరాజ్.. జగన్ సర్కార్ కీలక ఆదేశాలు

పోలీసులు ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోకపోయినా.. పట్టించుకోకపోయినా బాధితులు పీసీఏను ఆశ్రయించవచ్చు. పోలీసు అధికారులపై ఫిర్యాదులు చేయవచ్చు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పీసీఏ ఏర్పాటైంది.

Samayam Telugu 20 Jun 2021, 4:26 pm
గతంలో మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో వివాదం నేపథ్యంలో ఆయన్ను పదవి నుంచి తప్పించిన జగన్ సర్కార్.. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్‌ను ఆ పోస్టులో నియమించింది. అయితే ఆ నియామకం చెల్లదని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో తిరిగి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్‌ఈసీగా బాధ్యతలు స్వీకరించారు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరిపించేశారు. నాటకీయ పరిణామాల మధ్య పదవి కోల్పోయిన జస్టిస్ కనగరాజ్‌కి జగన్ సర్కార్ మరో అవకాశం కల్పించింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
kanagaraj


రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న పీసీఏ(పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ) చైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. అథారిటీలో మరో ముగ్గురు సభ్యులను కూడా ప్రభుత్వం నియమించింది. జిల్లా స్థాయిలోనూ ప్రభుత్వం పీసీఏ కమిటీలను ఏర్పాటు చేయనుంది. పోలీసులు ప్రజల ఫిర్యాదులు స్వీకరించుకున్నా.. ప్రజలకు న్యాయం చేయకపోయినా బాధితులు పీసీఏను ఆశ్రయించవచ్చు. పోలీసులపై వచ్చే ఫిర్యాదులను విచారించేందుకు పీసీఏలను ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఏపీ ప్రభుత్వం పీసీఏను ఏర్పాటు చేసింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు పీసీఏను ఏర్పాటు చేశాయి.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.