యాప్నగరం

సీఎఫ్ఐ ఏపీ ప్రధాన కార్యదర్శిగా లలిత్ కుమార్

కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా లలిత్ కుమార్‌ను నియమించారు.

Samayam Telugu 26 Oct 2020, 4:46 pm
కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కె.లలిత్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎఫ్ఐ అధ్యక్షుడు వైభవ్ తివారీ సోమవారం ప్రకటన విడుదల చేశారు. లలిత్ కుమార్ ప్రస్తుతం ఏపీ ఐఐటీ- జేఈఈ/ నీట్ ఫోరమ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
Samayam Telugu లలిత్ కుమార్


ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి వివక్షకు తావు లేకుండా సీఎఫ్ఐ లక్ష్యాలను, సేవలను లలిత్ కుమార్ విస్తృతపరుస్తారని పూర్తిగా విశ్వసిస్తున్నట్లు వైభవ్ తివార్ తెలిపారు. ఏపీలో సీఎఫ్ఐ సంస్థను లలిత్ బలపరుస్తారని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. న్యూఢిల్లీ కేంద్రంగా సీఎఫ్ఐ సంస్థ పనిచేస్తోంది.

ఈ సంస్థ అధ్యక్షుడిగా వైభవ్ తివారి, ప్రధాన కార్యదర్శిగా అలోక్ దీక్షిత్, ఉపాధ్యక్షులుగా సౌరభ్ సక్సేనా, సత్యేంద్ర కతియార్, జాయింట్ సెక్రటరీగా వినయ్ కుష్వాహా పని చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.