యాప్నగరం

సీఎం జగన్‌కు కేఏ పాల్ బంపరాఫర్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓకే అంటే త్వరలోనే కలుస్తానంటున్న కేఏ పాల్. స్నేహితుల ద్వారా జగన్‌కు ఆఫర్ ఇచ్చానని చెప్పుకొచ్చిన పాల్. జగన్ తనను ఆహ్వానిస్తే.. తాను కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు.

Samayam Telugu 17 Jan 2020, 11:48 am
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు చూస్తే బాధగా ఉందంటున్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. రైతులకు ఇబ్బందులు జరుగుతున్నాయని.. ధర్నాలు చేస్తే సమస్యలు పోవు అంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌‌మోహన్‌రెడ్డికి.. ఆయన స్నేహితుల ద్వారా తాను ఓపెన్ ఆఫర్ ఇచ్చానని చెప్పుకొచ్చారు. వారు ఆహ్వానిస్తే.. తనకు ఉన్న పరిచయాలతో రాష్ట్ర అభివృద్ధికి కృషిచేస్తాను అన్నారు. మూడు నెలల నుంచి ఆరు నెలల్లో.. ఆయన్ను కలిసి.. ఆహ్వానం మేరకు కొంతమంది బిలినియర్లు, మిలినియర్లను, ఇన్వెస్టర్లను తీసుకొచ్చి సమ్మిట్ పెట్టి అభివృద్ధి చేస్తానంటున్నారు.
Samayam Telugu ka pual.

ఎవరు ముఖ్యమంత్రి అన్నది ముఖ్యం కాదని.. పేద ప్రజలకు ఎలా న్యాయం జరగాలన్నదే ముఖ్యమన్నారు. రాష్ట్రం, ప్రజలు అభివృద్ధి చెందాలన్నదే తన ఉద్దేశం అన్నారు. ప్రతిపక్షాలన్నీ కలిసి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాయన్నారు. ఏడాదికి ఒకసారి సమ్మిట్ నిర్వహించి రాష్ట్రాన్ని ప్రగతిబాటలో నడిపిద్దామని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్ తనను ఆహ్వానిస్తే.. తాను కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.