ఉక్రెయిన్లో కడప జిల్లాకు చెందిన విద్యార్థి మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. కడప జిల్లా పెనగలూరు మండలం కోమంతరాజుపురం పంచాయతీ బెస్తపల్లెకు చెందిన సుబ్బారెడ్డి, భారతి దంపతులు జీవనోపాధి కోసం కువైట్లో ఉన్నారు. వారి కుమారుడు సంతోష్రెడ్డి వైద్య విద్యను అభ్యసించడానికి 2018 మార్చిలో కార్గ్కీవ్ జాతీయ వైద్య విశ్వవిద్యాలయంలో చేరాడు. గత ఏప్రిల్ 25న హాస్టల్లో డబుల్ కాట్ బెడ్ నుంచి ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ఈ ఘటనలో తలకు బలమైన గాయమైంది.
సంతోష్ రెడ్డిని తోటి విద్యార్థులు ఆస్పత్రికి తరలించారు. మెదడు భాగంలో సర్జరీ చేస్తుండగా ఇన్ఫెక్షన్ సోకి చనిపోయినట్లు డాక్టర్లు చెబుతున్నారు. కుమారుడి మృతదేహం ఉక్రైయిన్లోనే ఉండిపోవడం.. తల్లిదండ్రులో కువైట్లో చిక్కుకుపోయారు. అక్కడ కర్ఫ్యూ విధించడంతో స్వదేశానికి వచ్చే అవకాశం లేకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అయ్యారు. కుమారుడి చివరి చూపునకు నోచుకోలేమనే బాధలో ఉన్నారు. ఎలాగైనా కుమారుడి మృతదేహాన్ని.. తమను భారత్కుచేర్చాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
సంతోష్ రెడ్డిని తోటి విద్యార్థులు ఆస్పత్రికి తరలించారు. మెదడు భాగంలో సర్జరీ చేస్తుండగా ఇన్ఫెక్షన్ సోకి చనిపోయినట్లు డాక్టర్లు చెబుతున్నారు. కుమారుడి మృతదేహం ఉక్రైయిన్లోనే ఉండిపోవడం.. తల్లిదండ్రులో కువైట్లో చిక్కుకుపోయారు. అక్కడ కర్ఫ్యూ విధించడంతో స్వదేశానికి వచ్చే అవకాశం లేకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అయ్యారు. కుమారుడి చివరి చూపునకు నోచుకోలేమనే బాధలో ఉన్నారు. ఎలాగైనా కుమారుడి మృతదేహాన్ని.. తమను భారత్కుచేర్చాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.