యాప్నగరం

ఉక్రెయిన్‌లో కడప జిల్లా విద్యార్థి దుర్మరణం

కుమారుడి మృతదేహం ఉక్రైయిన్‌లోనే ఉండిపోవడం.. తల్లిదండ్రులో కువైట్‌లో చిక్కుకుపోయారు. కుమారుడి చివరి చూపునకు నోచుకోలేమనే బాధలో ఉన్నారు. కార్గ్కీవ్ జాతీయ వైద్య విశ్వవిద్యాలయంలో వైద్య విద్యను అభ్యసిస్తున్న సంతోష్‌రెడ్డి.

Samayam Telugu 12 May 2020, 11:52 am
ఉక్రెయిన్‌లో కడప జిల్లాకు చెందిన విద్యార్థి మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. కడప జిల్లా పెనగలూరు మండలం కోమంతరాజుపురం పంచాయతీ బెస్తపల్లెకు చెందిన సుబ్బారెడ్డి, భారతి దంపతులు జీవనోపాధి కోసం కువైట్‌లో ఉన్నారు. వారి కుమారుడు సంతోష్‌రెడ్డి వైద్య విద్యను అభ్యసించడానికి 2018 మార్చిలో కార్గ్కీవ్ జాతీయ వైద్య విశ్వవిద్యాలయంలో చేరాడు. గత ఏప్రిల్‌ 25న హాస్టల్‌లో డబుల్‌ కాట్‌ బెడ్‌ నుంచి ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ఈ ఘటనలో తలకు బలమైన గాయమైంది.
Samayam Telugu కడప జిల్లా విద్యార్థి


సంతోష్ రెడ్డిని తోటి విద్యార్థులు ఆస్పత్రికి తరలించారు. మెదడు భాగంలో సర్జరీ చేస్తుండగా ఇన్‌ఫెక్షన్‌ సోకి చనిపోయినట్లు డాక్టర్లు చెబుతున్నారు. కుమారుడి మృతదేహం ఉక్రైయిన్‌లోనే ఉండిపోవడం.. తల్లిదండ్రులో కువైట్‌లో చిక్కుకుపోయారు. అక్కడ కర్ఫ్యూ విధించడంతో స్వదేశానికి వచ్చే అవకాశం లేకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అయ్యారు. కుమారుడి చివరి చూపునకు నోచుకోలేమనే బాధలో ఉన్నారు. ఎలాగైనా కుమారుడి మృతదేహాన్ని.. తమను భారత్‌కుచేర్చాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.