యాప్నగరం

వైఎస్ వివేకా రెండో భార్యతో కూతురు సునీతకు విభేదాలు.. ఆ ముగ్గురితో కలిసి నాపై కుట్ర చేశారు: ఎంపీ అవినాష్ రెడ్డి

Mp Ys Avinash Reddy తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌లో ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన విషయాలను ప్రస్తావించారు. వైఎస్ సునీతారెడ్డి మరికొందరితో కలిసి కుట్ర చేశారని ఆరోపించార.. తనకు సంబంధం లేకపోయినా కేసులో ఇరికిస్తున్నారని పేర్కొన్నారు. సునీతకు వివేకా రెండో భార్యతో విభేదాలు వచ్చాయని.. దీంతో తండ్రిపై సునీత కక్ష పెంచుకున్నారన్నారు. సీబీఐ దగ్గర తాను నిందితుడిని అని తేల్చడానికి ఎలాంటి ఆధారాలు కూడా లేవన్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 17 Apr 2023, 1:54 pm

ప్రధానాంశాలు:

  • తెలంగాణ హైకోర్టులో అవినాష్ బెయిల్ పిటిషన్
  • కీలకమైన విషయాలను ప్రస్తావించిన కడప ఎంపీ
  • వైఎస్ సునీతపై సంచలన ఆరోపణలు చేశారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Ys Avinash Reddy
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (Ys Vivekanandareddy Murder Case)లో ట్విస్ట్‌లు కొనసాగుతున్నాయి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Ys Avinash Reddy) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌లో ఎంపీ సంచలన విషయాలను ప్రస్తావించారు. తనకు 160 Crpc కింద నోటీస్ ఇచ్చారని ప్రస్తావించారు. అలాగే ఈ హత్య కేసుతో తనకు సంబంధం లేదని.. కుట్ర పన్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వివేకా కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి (Ys Sunitha Reddy), స్థానిక ఎమ్మెల్సీ, రాష్ట్ర ప్రతిపక్ష నేతతో కలిసి కుట్ర చేస్తున్నారన్నారు. కేవలం గూగుల్ టే కౌట్ ఆధారంగానే తనను నిందితుడిగా చేర్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
తాను ఈ కేసులో ఇప్పటి వరకు నిందితుడిగా లేనని.. 2021లో సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీట్‌లో తనను అనుమానితుడిగా చేర్చారన్నారు. సీబీఐ దగ్గర తనపై నేరం రుజువు చేయడానికి ఎలాంటి ఆధారాలు లేవు అన్నారు. వివేకా హత్య కేసులో సీబీఐ మరో నిందితుడు దస్తగిరిని ఢిల్లీకి పిలిచి చాలా రోజుల అక్కడే ఉంచారన్నారు. అక్కడే అతడిని అప్రూవర్‌గా మార్చారని.. దస్తగిరి స్టేట్మెంట్ ఒక్కటే ప్రామాణికంగా సీబీఐ తీసుకుందన్నారు.

అలాగే వివేకానందరెడ్డి రెండో భార్య ఉందని.. ఆమె కొడుక్కి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సీటు ఇప్పిస్తానని వివేకా హామీ ఇచ్చారన్నారు. ఆ స్కూల్ పక్కనే విల్లా కొనుగోలు చేయాలని వివేకా భావించారన్నారు. వివేకా రెండో భార్యకు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని.. అందుకే కుమార్తె సునీత కక్ష గట్టింందన్నారు. ఆ తర్వాత వివేకా చెక్ పవర్‌ను సునీత తొలగించారని.. డబ్బు కోసం బెంగుళూరులో వివేకా ల్యాండ్ సెటిల్మెంట్స్ చేశారని ప్రస్తావించారు. నిందితులతో కలిసి వివేకా డైమండ్స్ వ్యాపారం చేశారని.. ఇద్దరు నిందితుల కుటుంబ సభ్యులతో వివేకాకు వివాహేతర సంబంధం ఉందన్నారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.