యాప్నగరం

సైలెన్సర్ తీసి రోడ్డెక్కిన యువకులు.. చితక్కొట్టిన ఎస్సె.. సస్పెండ్ చేసిన ఎస్పీ

లాక్‌‌డౌన్ వేళ సైలెన్సర్ తీసి రోడ్డుపైకి వచ్చిన యువకుల్ని చితక్కొట్టిన ఎస్సై వరప్రసాద్. సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారడంతో చర్యలు తీసుకున్న ఎస్పీ అన్బురాజన్.

Samayam Telugu 27 Mar 2020, 8:51 am
లాక్‌డౌన్ ఉంది బాబోయ్ రోడ్లపైకి రావొద్దని మొత్తుకుని చెబుతున్నారు పోలీసులు. ప్రజలంతా కచ్చితంగా ఇళ్లలోనే ఉండాలని.. ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. నిత్యావసరాలు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు కొంత సమయం కేటాయించామంటున్నారు. సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు పూర్తి స్థాయి కర్ఫ్యూ అమల్లో ఉంటుందంటున్నారు. ఇంత జరుగుతున్నా కొందరు ఆకతాయిలు మాత్రం రోడ్డెక్కుతున్నారు. ఈ గ్యాంగ్‌కు పోలీసులు ముందు పద్దతిగా చెబుతున్నారు.. అక్కడక్కడా లాఠీలకు పనిచెప్పక తప్పడం లేదు. నాలుగు తగిలించి మరీ ఆకతాయిల్ని మళ్లీ ఇళ్లకు పంపుతున్నారు.
Samayam Telugu kdp


Read Also: సోషల్ మీడియాకు చేరిన ఎస్సై నిర్వాకం.. సస్పెండ్ చేసిన డీజీపీ

కడపజిల్లా రాయచోటిలో ఓ ట్రాఫిక్ ఎస్సై ఓవరాక్షన్ చేశారు.. లాక్‌డౌన్ వేళ అత్యుత్సాహానికి పోయి చిక్కుల్లో పడ్డారు. బైక్‌పై బయటకు వచ్చిన ఇద్దరు యువకుల్ని చితకబాదారు. ఎస్సై దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాకు చేరడంతో ఎస్సైపై సస్పెన్షన్ వేటు పడింది. పట్టణంలో ఇద్దరు యువకులు బైక్ సైలెన్సర్ తీసి రోడ్డుపైకి వచ్చారు. పెద్దగా శబ్దాలు రావడంతో.. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్సై వరప్రసాద్ వాళ్లను ఆపారు.

ఇద్దరు యువకుల్ని పిలిచి లాఠీతో చితకబాదారు. సైలెన్సర్ ఎందుకు తీశారని ప్రశ్నించారు.. లాఠీతో బైక్‌ను ధ్వంసం చేశారు. ఈ సీన్ మొత్తాన్ని స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాకు చేర్చారు. విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఘటనపై విచారణ జరిపిన అధికారులు ఎస్సై వరప్రసాద్‌ను కడపకు పిలిపించారు.. వెంటనే విధుల నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ఎస్పీ ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.