యాప్నగరం

కడప జిల్లాలో దారుణం.. భార్యను కొడవలితో కర్కశంగా నరికి..

ఆస్తులు అమ్మవద్దని చెప్పిన పాపానికి భార్యను నరికి చంపాడో కసాయి భర్త. అడ్డొచ్చిన కొడుకును సైతం చంపేందుకు ప్రయత్నించడంతో అతను భయంతో పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నాడు.

Samayam Telugu 9 Nov 2019, 3:15 pm
పాపం.. భర్తకు రెండు మంచి మాటలు చెప్పాలనుకుంది ఆ ఇల్లాలు. అదే ఆమె పాలిట శాపమవుతుందని ఊహించలేదు. చివరికి కట్టుకున్న భర్త చేతిలోనే దారుణ హత్యకు గురైంది. తన ఇష్టానికి అడ్డుపడుతుందన్న కసితో కొడవలితో భార్యను నరికి చంపాడు భర్త. తల్లిపై దాడికి తెగబడడంతో తండ్రిపై తిరగబడ్డాడు కొడుకు. అడ్డొచ్చిన కొడుకుపై కూడా తండ్రి కత్తి ఎత్తడంతో ఎలాగో తప్పించుకుని పారిపోయి బతికిపోయాడు. మానవీయ విలువలను మంటగలిపిన ఈ దారుణ ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది.
Samayam Telugu kadapa


రాయచోటి పట్టణంలోని కొత్తపేటకు చెందిన ఖాదర్ వలి, నూర్జహాన్ దంపతులు. ఖాదర్ వలికి లక్కిరెడ్డిపల్లి మండలం మద్దిరేవుల రెడ్డివారిపల్లి గ్రామంలో మామిడి తోట ఉంది. ఆ తోటను అమ్మేందుకు ఖాదర్ వలి ప్రయత్నాలు చేస్తుండడంతో కొద్దికాలంగా కుటుంబంలో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. తోట అమ్మేందుకు కుమారుడు మహ్మద్ రఫీ కూడా అభ్యంతరం చెప్పడంతో ఖాదర్ వలి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.

Also Read: కంటైనర్ కింద నలిగి.. ఒకే కుటుంబంలో 8 మంది.. ఛిద్రమైన మృతదేహాలు

అదే విషయమై మరోసారి గొడవ జరగడంతో భార్యను అంతమొందించాలని ఖాదర్ వలి నిర్ణయానికి వచ్చాడు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో కొడవలితో భార్య నూర్జహాన్ తలపై నరికి చంపేశాడు. అదే సమయంలో తండ్రిని కొడుకు రఫీ అడ్డుకోబోయాడు. ఖాదర్ వలి కొడుకుపై కూడా దాడికి ప్రయత్నించడంతో అతను పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు. కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి. మామిడితోటపై ఏర్పడిన వివాదం చినికి చినికి దారుణ హత్యకు దారితీసింది. ఆ కుటుంబాన్ని ఛిద్రం చేసింది.

Read Also: తిరుపతిలో ఘోరం.. ఉద్యోగినితో బలవంతంగా మద్యం తాగించి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.