యాప్నగరం

కడప: నడిరోడ్డుపై కొట్టుకున్న వైసీపీ నేతలు.. ఎమ్మెల్యే చూస్తుండగానే..

కడప జిల్లా అధికార వైసీపీలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. రెండు వర్గాల నాయకులు నడిరోడ్డుపైనే కొట్టుకున్నారు.

Samayam Telugu 27 May 2020, 4:33 pm
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లా కడప.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. వైసీపీ నాయకులు ఒకరిపై మరొకరు బాహాబాహీకి దిగారు. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరుకుంది. బి.కోడూరు మండలం పాయలకుంట గ్రామంలో బుధవారం సచివాలయ భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేశారు. బద్వేల్‌ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య గ్రామ సచివాలయ శంకుస్థాపనకు రాగా.. ఒక వర్గం వారు ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఈ ఘర్షణ చోటుచేసుకుంది. రామకృష్ణారెడ్డి, డి. యోగానంద్‌ రెడ్డి వర్గీయులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.
Samayam Telugu కొట్టుకుంటున్న వైసీపీ నేతలు


అయితే ఈ కార్యక్రమానికి ఓ వర్గాన్ని ఉద్దేశపూర్వకంగా పిలవలేదంటూ గొడవ చెలరేగింది. ఇది కాస్తా వైసీపీ నాయకుల మధ్య ఘర్షణగా మారింది. దీంతో ఇరువర్గాలు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నాయి. అలాగే నాయకులు నడిరోడ్డుపై కొట్టుకున్నారు. లాక్ డౌన్ వేళ ఒకరిపై మరొకరు పడుతూ వందలాది మంది గుమిగూడి గొడవపడ్డారు.

Please Vote: పోల్: జగన్ ఏడాది పాలన ఎలా ఉంది?

ఈ ఘర్షణల్లో ఎనిమిది మంది గాయాలపాలయ్యారు. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. మాటవినని వారిపై లాఠీ ఝుళిపించారు. అయితే గాయపడ్డ 8 మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, బద్వేలు వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య చూస్తుండగానే ఇరు వర్గాలు కొట్లాటకు దిగడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.