యాప్నగరం

వర్షంతో కపిలతీర్థం పరవళ్లు.. తిరుమల గిరుల్లో సరికొత్త అందాలను చూడండి

Tirumala తిరుపతి కొండలు భారీ వర్షాలతో కొత్త అందాలను సంతరించుకున్నాయి. కపిల తీర్థం జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఆ అందాలను చూడటానికి పర్యాటకులు పోటెత్తారు.

Samayam Telugu 21 Aug 2019, 12:28 am
తిరుపతిలో కురిసిన భారీ వర్షంతో తిరుమల గిరులు జలధారలతో కొత్త శోభ సంతరించుకున్నాయి. సోమవారం (ఆగస్టు 19) కురిసిన భారీ వర్షంతో తిరుమల కొండలోని కపిలతీర్థం పవవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి భారీ ప్రవాహం కొనసాగుతోంది. ఆకాశగంగను తలపిస్తున్న కపిలతీర్థం అందాలను వీక్షించడానికి పర్యాటకులు పోటెత్తారు. కపిలతీర్థం జలపాత ప్రవాహ ఉధృతిని దృష్టిలో ఉంచుకుని ఆలయానికి వచ్చే భక్తులను అధికారులు కోనేరులోకి దిగనివ్వడంలేదు. జలపాతం వద్ద స్నానం ఆచరించడాన్ని నిషేధించారు.

Don't Miss: శ్రీశైలం వివాదానికి ముగింపు పడినట్లేనా?

రెండు రోజులుగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కపిల తీర్థం ఉప్పొంగి ప్రవహిస్తున్న దృశ్యాలను వీడియోలో చూడవచ్చు. కపిల తీర్థంతో పాటు మాలవాని గుంట జలపాతం కూడా ఉప్పుంగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.