యాప్నగరం

YS Jagan సీఎం కావడానికి సహకరించిన వ్యక్తిని సస్పెండ్ చేశారేంటి?: కేశినేని నాని

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయమై టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. సన్మానించాల్సింది పోయి సస్పెండ్ చేశారేంటని ఆయన ప్రశ్నించారు.

Samayam Telugu 9 Feb 2020, 1:06 pm
చంద్రబాబు నాయుడి హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ జగన్ సర్కారు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ సంస్థ నుంచి నిఘా పరికరాలు కొనుగోలు చేసి.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే కారణంతో ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. గతంలో ఆయన్ను బదిలీ చేసిన ప్రభుత్వం కొన్నాళ్లపాటు వెయిటింగ్ లిస్టులో ఉంచింది. తాజాగా ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.
Samayam Telugu kesineni nani satirical tweet on suspension of senior ips officer ab venkateswara rao
YS Jagan సీఎం కావడానికి సహకరించిన వ్యక్తిని సస్పెండ్ చేశారేంటి?: కేశినేని నాని


ఈ విషయమై టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు. ‘‘మీరు సీఎం కావడానికి, వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడానికి, తెలుగు దేశం పార్టీ ఓడిపోవడానికి ప్రధాన భూమిక పోషించిన వ్యక్తిని సన్మానిస్తారనుకుంటే సస్పెండ్ చేశారేంటి జగన్మోహన్ రెడ్డి గారూ’’ అని నాని ట్వీట్ చేశారు.

బాబు హయాంలో ఇంటిలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన వెంకటేశ్వరరావుతోపాటు కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలు టీడీపీకి అనుకూలంగా పని చేస్తున్నారని ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఏబీ వెంకటేశ్వరరావు టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ ఆరోపించింది. దీంతో ఈ ముగ్గుర్ని ఎన్నికల సంఘం బదిలీ చేసింది.

కాగా, ఏబీ వెంకటేశ్వర రావుకు ఎన్నికల విధులతో సంబంధం లేదనే కారణంతో ఏపీ సర్కారు ఆయన బదిలీని ఆపేసింది. బదిలీల వ్యవహారంపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. కానీ ఎన్నికల సంఘం వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం తేల్చి చెప్పడంతో.. ఆయన్ను డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.