యాప్నగరం

కోడెల మృతి: గవర్నర్‌ను కలవనున్న టీడీపీ నేతలు.. కారణం అదేనా?

వైఎస్ జగన్ సర్కార్ అరాచకాలపై గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ మేరకు టీడీపీ నేతలు గురువారం ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్‌ని కలవనున్నారు.

Samayam Telugu 18 Sep 2019, 4:00 pm
టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యను తెలుగుదేశం సీరియస్‌గా తీసుకుంది. ప్రభుత్వ వేధింపుల కారణంగానే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి నెలకొందని, టీడీపీ నేతలను కేసుల పేరుతో వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
Samayam Telugu pjimage (64)


Must Read: కోడెల అంత్యక్రియలకు అధికారుల ఏర్పాట్లు .. ససేమిరా అంటున్న కుటుంబ సభ్యులు

కోడెల మరణంతో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ జగన్ సర్కార్ అరాచకాలపై గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు టీడీపీ నేతలు గురువారం ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ని కలవనున్నారు. కోడెల ఆత్మహత్యపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను గవర్నర్‌కు వివరించనున్నారు.

Also Read:చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే కోడెల చనిపోయారు.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

కోడెల ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలని చంద్రబాబు ఇప్పటికే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గవర్నర్‌తో భేటీలో ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోడెల ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపించాలని కోరనున్నారు. సీబీఐ విచారణ విషయాన్ని గవర్నర్‌ వద్ద ప్రస్తావించే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.