యాప్నగరం

‘ఉరికి వేలాడుతున్న కోడెల సార్‌ని కిందికి దించాను’

‘సోమవారం ఉదయమే కోడెల సార్ ఇంటికి వెళ్లాను. 9.30 గంటల సమయంలో ఆయన ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్లడం చేశాను. ఆ తరువాత తలుపులు తెరుకుకోవడం లేదంటూ 11 గంటలకు కోడెల కుమార్తె విజయలక్ష్మి పిలిచారు.’

Samayam Telugu 17 Sep 2019, 11:50 am
ఏపీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు సోమవారం ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. హైదరాబాద్ జారాహిల్స్‌లోని ఆయన నివాసంలో ఫ్యానుకు ఉరి వేసుకుని కోడెల బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కోడెల ఇంట్లోనే ఉన్న ఆయన గన్‌మ్యాన్ ఆదామ్ ఆ రోజు జరిగిన సంఘటనలపై మాట్లాడారు.
Samayam Telugu pjimage (59)


సోమవారం ఉదయమే తాను కోడెల నివాసానికి వెళ్లినట్లు ఆదామ్ తెలిపారు. సుమారు 9.30 గంటల సమయంలో కోడెల పై అంతస్తుకు వెళ్లారని, ఆయన పైకి వెళ్లడాన్ని తాను చూసినట్లు చెప్పారు. ఆయన కూతురు విజయలక్ష్మి 11 గంటల సమయంలో కోడెల గది వద్దకు వెళ్లారు. తలుపు తీయడం లేదంటూ ఐదు నిమిషాలలోపే తనను విజయలక్ష్మి పిలిచారని, వెంటనే తాను పై అంతస్తుకి వెళ్లినట్లు చెప్పారు.

Must Read: కోడెలది హత్యే.. కుమారుడే చంపించాడు: కోడెల బావమరిది సాయి పోలీసులకు ఫిర్యాదు

కోడెల గది తలుపులు తెరుచుకోకపోవడంతో కిటికీ నుంచి లోపలికి ప్రవేశించినట్లు ఆదామ్ తెలిపారు. అప్పటికే ఆయన ఫ్యాన్‌కి ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించారన్నారు. నైలాన్ తాడుతో ఉరి వేసుకున్నట్లు గన్‌మ్యాన్ చెప్పారు. తానే సార్‌ని కిందికి దించానని, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

Also Read: ‘జగన్ గారూ! మీరసలు మనుషులేనా?’

అయితే కోడెల ఆత్మహత్యపై టీడీపీ, వైఎస్సార్సీపీ పరస్పర విమర్శలకు దిగాయి. ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల మరణించారని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని టీడీపీ ఆరోపిస్తోంది. కుటుంబ కలహాలున్నట్లు వార్తలు వస్తున్నాయని, టీడీపీ నేతలు కావాలనే ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎదురుదాడికి దిగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.