యాప్నగరం

కోర్టులో లొంగిపోయిన కోడెల శివప్రసాదరావు కుమార్తె

ఉద్యోగాల పేరుతో డబ్బు వసూలు చేశారని ఆరోపణలపై విజయలక్ష్మిపై కేసు.. నరసరావుపేట కోర్టులో లొంగిపోయిన మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు కూతురు విజయలక్ష్మి.

Samayam Telugu 31 Oct 2019, 10:34 pm
దివంగత మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మి నరసరావుపేట కోర్టులో లొంగిపోయారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం గురువారం సాయంత్రం ఆమె లాయర్లను వెంటబెట్టుకొని కోర్టుకు హాజరయ్యారు. విచారణ జరిపిన కోర్టు.. షరతులతో కూడిన బెయిల్ కూడా మంజూరు చేసింది. ప్రతి ఆదివారం నరసరావుపేట వన్‌టౌన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్లలో సంతకాలు పెట్టాలని ఆదేశించింది.
Samayam Telugu vijaya lakshmi


Don't Miss: 'మంత్రులు మాట్లాడాల్సిన మాటలేనా.. క్షమాపణ చెప్పండి'

Read Also: ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలకు టీడీపీ రూ.లక్ష ఆర్థిక సాయం

విజయలక్ష్మి ఉద్యోగాల పేరుతో డబ్బు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. షేక్ యాసిన్,ఆడపాల సాయి అనే వ్యక్తుల ఫిర్యాదుతో.. పోలీసులు ఆమెపై 420,506,బెదిరింపులు, అక్రమ వసూళ్లు కేసులు నమోదు చేశారు. ఈ కేసు విషయంలోనే విజయలక్ష్మి నరసరావుపేట కోర్టులో లొంగిపోయారు. విచారణ జరిపిన జడ్జి బెయిల్ ఇచ్చారు. విజయలక్ష్మికి ఇప్పటి వరకు రెండు కేసుల్లో బెయిల్ వచ్చింది. ఇవే కాక మరికొన్ని కేసుల్లో కూడా ఆమెపై ఉన్నాయి.

కోడెల ఏపీ స్పీకర్‌గా ఉన్న సమయంలో కొడుకు శివరామ్, కూతురు విజయలక్ష్మీ సత్తెనపల్లి, నరసరావుపేట ప్రాంతాల్లో బెదిరింపులు, అక్రమ వసూళ్లకు పాల్పడినట్టు ఫిర్యాదు అందాయి. శివరాం కూడా ఈ మధ్యే కోర్టుకు హాజరుకాగా.. బెయిల్ మంజూరయ్యింది. అలాగే కోడెలపైనా అసెంబ్లీ ఫర్నీచర్ కేసు నడుస్తోంది. ఇదంతా జరుగుతుండగానే శిపవ్రసాదరావు హైదరాబాద్‌లోని నివాసంలో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.