యాప్నగరం

కృష్ణా: తండ్రి ఆశలు ఆవిరి.. గౌతమీ ప్రియ మృతదేహం లభ్యం

పడవ బోల్తా ఘటనలో గల్లంతైన గౌతమీ ప్రియ మృతదేహం లభ్యం. మృతదేహాన్ని బయటకు తీసిన ఎన్డీఆర్‌ఎఫ్ టీమ్. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను నిలదీసిన గ్రామస్థులు. నిర్లక్ష్యం వల్లే బాలిక చనిపోయిందని ఆగ్రహం.

Samayam Telugu 17 Aug 2019, 12:14 pm
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లు దగ్గర పడవ బోల్తా ఘటనలో గల్లంతైన గౌతమీ ప్రియ మృతదేహం లభ్యమయ్యింది. ఉదయం నుంచి గౌతమి ప్రియ కోసం ఎన్డీఆర్‌ఎఫ్ టీమ్‌ గాలిస్తుండగా.. ప్రమాదం జరిగిన స్థలానికి కొద్ది దూరంలో ఉన్న శివాలయం సమీపంలో మృతదేహాన్ని బయటకు తీశారు. కూతురు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.

అంతకముందు చెవిటికల్లు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌పై స్థానికులు మండిపడ్డారు. బోటు ఏర్పాటు చేయకపోవడం వల్లే బాలిక చనిపోయిందంటూ గ్రామస్థుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. స్థానికులు బోట్లు ఏర్పాటు చేయాలని హోం మంత్రికి ఫోన్ చేశారు. తాము అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేస్తుంటే.. హోం మంత్రికి ఫోన్ చేయడం ఏంటని ఎమ్మెల్యే ఆవేశంతో ఊగిపోయారు.హోం మంత్రి ఇక్కడికి వచ్చి ఏమి చేస్తుంది అంటూ ప్రశ్నించారు. వరదల్లో ఓడలు అడిగితే హోం మంత్రి ఇస్తారా అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు.వీఆర్వోలు, అట్టడుగు స్థాయి వాళ్లను బోట్లు అడిగితే ఏమిస్తారన్న ఎమ్మెల్యే.. ఇక్కడికి వచ్చి అంతా నాన్సెన్స్ చేస్తున్నారంటూ మండిపడ్డారు.

Read Aslo: వరద విషాదం: పడవ బోల్తా.. తండ్రి కళ్ల ముందే గల్లంతైన బాలిక

గ్రామాన్ని వరద ముంచెత్తడంతో చెవిటికల్లుకు చెందిన స్థానికులు నాటు పడవల్ని ఆశ్రయిస్తున్నారు. స్థానికులు కొందరు ఓ పడవలో బయల్దేరారు.. అదే గ్రామానికి చెందిన రమేష్ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి అదే పడవలో ఉన్నారు. పడవ కొద్ది దూరం వెళ్లగానే తిరగబడిపోయింది.. ఆ సమయంలో పడవలో 9మంది ఉన్నారు. వెంటనే రమేష్ తన పెద్ద కూతురు లక్ష్మి ప్రియను పక్కకు లాగి కాపాడాడు.. తర్వాత రెండో కూతురు గౌతమీ ప్రియను లాగే లోపు గల్లంతయ్యింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.