యాప్నగరం

విజయవాడవాసులకు అలర్ట్.. ఈ ప్రాంతాలవారు జాగ్రత్తగా ఉండాలి

ప్రకాశం బ్యారేజీ వద్ద సాయంత్రానికి వరద పెరిగే అవకాశముందని.. ఊహించని రీతిలో భారీగా వరద వచ్చే అవకాశం ఉందన్నారు. బ్యారేజీ నుంచి ప్రస్తుతం 7.50లక్షల క్యూసెక్కుల నీరు వస్తోందన్నారు.

Samayam Telugu 16 Oct 2020, 12:49 pm
విజయవాడవాసులకు అలర్ట్.. కృష్ణా నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోందని కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద సాయంత్రానికి వరద పెరిగే అవకాశముందని.. ఊహించని రీతిలో భారీగా వరద వచ్చే అవకాశం ఉందన్నారు. బ్యారేజీ నుంచి ప్రస్తుతం 7.50లక్షల క్యూసెక్కుల నీరు వస్తోందన్నారు. వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదిలేస్తున్నామని.. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు.
Samayam Telugu విజయవాడవాసులకు అలర్ట్


జగ్గయ్యపేట నుంచి నదీ పరీవాహకంలోని 18 మండలాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్టీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న జనాలను పునరావాస కేంద్రాలకు తరలించే పనిలో ఉన్నారు. కలెక్టర్ అధికారులతో పరిస్థిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.