యాప్నగరం

TTD ఈవోగా కేఎస్ జవహర్‌రెడ్డి.. పూర్తి వివరాలు ఇవే!

TTD EO: తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి కేఎస్ జవహర్ రెడ్డి నియమితులయ్యారు.

Samayam Telugu 7 Oct 2020, 11:51 pm
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి కేఎస్ జవహర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్‌రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. ఈవోగా బదిలీ అయిన తరుణంలో గురువారం లేదా శుక్రవారం జవహర్ రెడ్డి బాధ్యతలు తీసుకుంటారని తెలుస్తోంది. టీటీడీ ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్‌ ఇటీవలే బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో టీటీడీ అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్న ఏవీ ధర్మారెడ్డికి అదనపు ఈవోగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.
Samayam Telugu కేఎస్ జవహర్ రెడ్డి


ఈ తరుణంలో జవహర్ రెడ్డిని పూర్తి స్థాయి టీటీడీ ఈవోగా జవహర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. కాగా, రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణంలో జవహర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. కరోనాకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు అందజేస్తూ మంచి పేరు సంపాధించారు. ఈ తరుణంలో జవహర్ రెడ్డికి కీలకమైన టీటీడీ ఈవోగా బాధ్యతలు అప్పగించింది.

టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను ఇటీవలే ప్రభుత్వం బదిలీ చేసింది. మూడేళ్లకు పైగా ఈవో పదవిలో కొనసాగిన సింఘాల్‌ను పదవి నుంచి తప్పిస్తారంటూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన్నప్పటి నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల బ్రాహ్మోత్సవాలు ముగిసిన అనంతరం సెప్టెంబర్ 30న (బుధవారం) రాత్రి ఆయన్ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ను వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అలాగే ప్రస్తుతం టీటీడీ అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్న ఏవీ ధర్మారెడ్డికి అదనపు ఈవోగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ధర్మారెడ్డి 1991వ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. కాగా, 1993 బ్యాచ్‌‌కు చెందిన ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్‌ను 2017 మే నెలలో టీటీడీ ఈవోగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నియమించింది. ఢిల్లీ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్న ఆయన్ను టీటీడీ ఈవోగా నియమించింది. సింఘాల్ రెండేళ్ల పదవీకాలం 2019లో ముగిసింది. కానీ, వైసీపీ ప్రభుత్వం ఆయన్ను ఈవోగా కొనసాగిస్తూ అప్పట్లో నిర్ణయం తీసుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.