యాప్నగరం

కుప్పం ఏఎస్సై ఆత్మహత్య..

చిత్తూరు జిల్లా కుప్పం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై రాజేంద్ర ప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Samayam Telugu 3 Jun 2020, 11:45 pm
చిత్తూరు జిల్లా కుప్పం పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై రాజేంద్ర ప్రసాద్ (57) బుధవారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుప్పం అర్బన్‌ సీఐ ఈదూర్ బాషా తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరుకు చెందిన రాజేంద్రప్రసాద్ గత సెస్టెంబర్‌లో కుప్పం పోలీసు స్టేషన్‌కు ఏఎస్సైగా బదిలీపై వచ్చారు. బుధవారం విధులకు రాకపోవడంతో పోలీసు సిబ్బంది ఫోన్ ద్వారా సంప్రందించినా.. ఎలాంటి స్పందన రాలేదు.
Samayam Telugu కుప్పం ఏఎస్సై ఆత్మహత్య


కుటుంబ సభ్యులు సైతం ఉదయం 7 గంటల నుంచి ఫోన్ ద్వారా ప్రయత్నించినా ఏఎస్సై రాజేంద్ర ప్రసాద్ నుంచి స్పందన రాలేదు. దీంతో కుప్పంలోని పాతపేట గాండ్లవీధిలో ఆయన అద్దెకు ఉంటున్న ఇంటికి సహచర పోలీసులు వెళ్లి బయట నుంచి ఎంత పిలిచినా పలుకలేదు. దీంతో అనుమానం వచ్చి తలుపులు పగలకొట్టి చూడగా రాజేంద్రప్రసాద్‌ ఇంట్లో ఉన్న దూలానికి వేలాడుతూ కనిపించాడు.

ఆయనను వారం క్రితమే చిత్తూరు వన్ టౌన్‌కు బదిలీ చేసినట్లు ఉత్తర్వులు వచ్చాయి. ఆయన ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని సీఐ ఈదూర్‌ బాషా పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.