యాప్నగరం

Kuppam Bank Scam: చంద్రబాబు పీఏపై ఫిర్యాదు, కేసు నమోదు

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో బ్యాంక్‌లో అవకతవకలు జరిగాయని.. ఇటీవల నిర్వహించిన ఆడిటింగ్‌లో స్కాం బయటపడినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Samayam Telugu 30 Apr 2020, 12:58 pm
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిపై కేసు నమోదైంది. ఆయనపై ఐపీసీ 420, 468, 471 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. కుప్పం కో ఆపరేటివ్ టౌన్ బ్యాంక్‌లో చంద్రబాబు పీఏ పి.మనోహర్ స్కాం చేశారని వైఎస్సార్‌సీపీ నేత విద్యాసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో బ్యాంక్‌లో అవకతవకలు జరిగాయని.. ఇటీవల నిర్వహించిన ఆడిటింగ్‌లో స్కాం బయటపడినట్లు చెబుతున్నారు. ఆడిట్‌లో బంగారం విషయంలో లెక్కలు తేడా వచ్చాయని.. లాకర్ ఇంఛార్జ్‌ని బాధ్యులను చేయగా.. మార్చి 15లోపు ఆ డబ్బులు కట్టాలని స్పష్టం చేసినా చెల్లించలేకపోయినట్లు తెలుస్తోంది.
Samayam Telugu కుప్పం


అలాగే కుప్పంలో ఉన్న ప్రసన్న తిరుపతి గంగమాంబ దేవస్థానంకు సంబంధించి ఫిక్స్‌డ్ డిపాజిట్లపైనా లోన్‌లు తీసుకున్నట్లు ఫిర్యాదులో ప్రస్తావించారు. దీనిపై బ్యాంక్ మేనేజర్‌ను నవీన్ బాబును ప్రశ్నించగా.. చంద్రబాబు పీఏ మనోహర్.. శ్రీనివాసులు అనే వ్యక్తిని పంపారని, ఆయన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ దేవస్థానం పేరిట 16 బాండ్లు కుదువపెట్టి లోన్‌లు తీసుకున్నారని తేలిందట. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.