యాప్నగరం

పండగపూట విషాదం.. తండ్రి తిట్టాడని కొడుకు ఆత్మహత్య

తనకు చెప్పకుండా స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లినందుకు తండ్రి మందలించాడని ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్న ఇంటర్ విద్యార్థి. కర్నూలు జిల్లాలో పండుగపూట తీవ్ర విషాదం.

Samayam Telugu 15 Jan 2020, 3:42 pm
సంక్రాంతి పండగ ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సినిమాకు వెళ్లినందుకు తండ్రి మందలించాడని కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలంరేపింది. ఆళ్లగడ్డ సమీపంలోని చింతకుట్లకు చెందిన తరు‌ణ్‌కుమార్‌రెడ్డి నంద్యాలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. సంక్రాంతి సెలవులు కావడంతో సొంత ఊరికి వెళ్లాడు.. అక్కడే స్నేహితులతో కలిసి ఉత్సాహంగా గడుపుతున్నాడు.
Samayam Telugu knl.


ఈ క్రమంలో తరుణ్ తన స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లాడు. తర్వాత విషయం తండ్రికి తెలియడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు.. కొడుకును మందలించాడు. తండ్రి తిట్టడంతో అవమానంగా భావించాడు.. తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. వెంటనే ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. కొడుకు మరణంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.. పండుగ రోజు ఘటన జరగడంతో.. స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.