యాప్నగరం

అమెరికాలో విషాదం.. ఉన్నత చదువుల కోసం వెళ్లిన తెలుగమ్మాయి దుర్మరణం

Kurnool Student Died In Seattle లో ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన యువతి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. సోమవారం రాత్రి ఆమె థామస్ స్ట్రీట్‌లో నడుచుకుంటూ వెళుతుండగా పోలీస్కారు ఢీకొట్టింది. ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయారు. నాలుగు రోజుల క్రితం కూడా చికాగోలో కాల్పుల ఘటనలో విజయవాడకు చెందిన విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 21 Dec 2023, 5:56 am

ప్రధానాంశాలు:

  • అమెరికాలో తెలుగమ్మాయి దుర్మరణం
  • ఉన్నత చదువుల కోసం వెళ్లిన జాహ్నవి
  • కర్నూలు జిల్లా ఆదోనిలో విషాదచాయలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Kurnool Student Died In Usa
అమెరికాలో మరో విషాదం చోటు చేసుకుంది. ఎన్నో కలలు, మరెన్నో ఆశలతో అగ్రరాజ్యం అమెరికా వెళ్లిన ఓ ఏపీ యువతి కలలు కల్లలయ్యాయి. విధి వక్రించి జరిగిన రోడ్డు ప్రమాదంలో.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కందుల జాహ్నవి అనే యువతి ప్రాణాలు కోల్పోయింది.
కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్వవి అనే యువతి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. సియాటిల్‌ప్రాంతంలో ఉంటున్న జాహ్నవి.. సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో డెక్స్టర్ అవెన్యూ నార్త్, థామస్ స్ట్రీట్లో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో రోడ్డుప్రమాదానికి గురైంది. పోలీస్ పెట్రోలింగ్ వాహనం బలంగా ఢీ కొనటంతో జాహ్నవి తీవ్రంగా గాయపడింది. వెంటనే అంబులెన్సులో ఆమెను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. తీవ్రంగా గాయపడటంతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్నుమాసింది.

జాహ్నవి చనిపోయిన విషయాన్ని అధికారులు ఆమె కుటుంబసభ్యులకు చేరవేశారు. కుమార్తె మరణవార్త వినటంతో జాహ్నవి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు ప్రమాదానికి కారణమైన అధికారి 2019 నుంచి విధులు నిర్వహిస్తున్నాడని సియాటిల్ పోలీసులు చెప్పారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

నాలుగు రోజుల క్రితం చికాగోలో తెలుగు విద్యార్థులపై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విజయవాడకు చెందిన విద్యార్థి చనిపోగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడకు చెందిన దేవాన్ష్, హైదరాబాద్‌కు చెందిన సాయిచరణ్చికాగోలోని గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్నారు. వీరు మరో విద్యార్థితో కలిసి వాల్‌మార్ట్‌కు వెళ్తున్నార.. ఇంతలో ఒక్కసారిగా నల్ల జాతీయులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వీళ్లిద్దరినీ వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. దేవాన్ష్ ప్రాణాలు కోల్పోగా.. మరోవైపు సాయిచరణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఇప్పుడు జాహ్నవి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.