యాప్నగరం

మా ఇంట్లో చిన్న ఎన్టీఆర్ పుట్టాడు.. లక్ష్మీ పార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు

గత 25 ఏళ్ల నుంచి ఏ దగా కోరు రాజకీయాలు నడిచాయో.. ఇప్పుడు కూడా అవే నడుస్తున్నాయన్నారు. దొంగలు వెంటనే దొరికిపోతున్నారని.. ఎవరూ బుకాయించడానికి లేదని.. మభ్యపెట్టడానికి లేదన్నారు.

Samayam Telugu 18 Jan 2021, 10:28 am
ఏపీలో మంచి పరిపాలన సాగుతోందని.. జగన్ పాలన రామరాజ్యంలా నడుస్తోందన్నారు ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి. దివంగత ఎన్టీఆర్‌ 25వ వర్ధంతికి హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించారు. తెలుగు వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి ఎన్టీఆర్.. స్ఫూర్తి ప్రధాత అన్నారు. ఆయన సుపరిపాలన అందరికి ఆదర్శం కావాలని.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనే శ్రీరామ రక్ష అని ప్రశంసలు కురిపించారు. తన ఇంట్లో చిన్న ఎన్టీఆర్ పుట్టాడని.. మనవడు జన్మించాడని లక్ష్మీపార్వతి తెలిపారు. ఆయన ఆశయ స్పూర్తితో తన భర్త ఆశీస్సులు ఆ బిడ్డ పై ఉండాలని ఆకాంక్షించారు.
Samayam Telugu లక్ష్మీ పార్వతి


ఏపీలో విగ్రహాల ధ్వంసంపై లక్ష్మీపార్వతి స్పందించారు. గత 25 ఏళ్ల నుంచి ఏ దగా కోరు రాజకీయాలు నడిచాయో.. ఇప్పుడు కూడా అవే నడుస్తున్నాయన్నారు. దొంగలు వెంటనే దొరికిపోతున్నారని.. ఎవరూ బుకాయించడానికి లేదని.. మభ్యపెట్టడానికి లేదన్నారు. అంత మంచి పాలన అందిస్తున్న జగన్‌కు వ్యతిరేకంగా నీచమైన కుట్ర జరుగుతోందని.. కానీ పోలీసులు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారన్నారు. జగన్‌ను ఎవరూ ఏమీ చేయలేరని.. ఆ కుట్రలన్నీ గాలికి పోతాయన్నారు. ప్రజాభిమానమే ఏపీ సీఎంకు శ్రీరామ రక్ష అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.