యాప్నగరం

నిమ్మగడ్డను వెంటనే నియమించండి... గవర్నర్‌కు న్యాయవాది లేఖ

గవర్నర్‌కు లేఖ రాశారు లాయర్ నర్రా శ్రీనివాస్. వెంటనే ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డను నియమించాలన్నారు. ఆ విషయంలో గవర్నర్ నిర్ణయం తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కట్టబడుతున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు.

Samayam Telugu 26 Jul 2020, 11:25 am
ఎన్నికల కమిషనర్ అంశంపై గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌కు న్యాయవాది నర్రా శ్రీనివాస్ లేఖ రాశారు. రాజ్యాంగం ఎన్నికల కమిషనర్‌ను నియమించే అధికారం గవర్నర్‌కు కల్పించిందన్నారు. ఆ అధికారాన్ని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి కట్టబడుతున్నారని అన్నారు. ఇది సరైన విధానం కాదన్నారు. గవర్నర్‌కు ఉన్న అధికారంతో తక్షణమే నిమ్మగడ్డ రమేష్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని గవర్నర్‌ విశ్వభూషణ్‌కు లాయర్ విజ్ఞప్తి చేశారు.
Samayam Telugu నిమ్మగడ్డ రమేష్
nimmagadda ramesh


ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ పదవి చేపట్టే విషయంలో రోజుకో వ్యవహారం చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమారే కొనసాగాలంటూ న్యాయస్థానాలు, గవర్నర్ చెప్పినా.. ఆమేరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవడం తెలిసిందే. ఈ విషయంలో జగన్ సర్కారుపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణపై స్టే ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం తీవ్ర స్థాయిలో స్పందించింది. ఇప్పటికే రాజకీయంగానూ తీవ్ర విమర్శలకు ఎదుర్కొంటున్న జగన్ సర్కారుకు కోర్టుల్లో మరోసారి చుక్కెదురు కావడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.