యాప్నగరం

తిరుమలలో చిరుత సంచారం.. దర్జాగా గోడపై కూర్చుని

చిరుత కదలికలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. శ్రీవారి దర్శనం అనతరం లడ్డూ ప్రసాదం తీసుకుని భక్తులు బయటకు వచ్చే రోడ్డులోనే చిరుత తిరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Samayam Telugu 3 Sep 2020, 7:06 am
తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలంరేపింది. అర్ధరాత్రి దాటిన తర్వాత శ్రీవారి పాదాల దగ్గర అటవీ ప్రాంతం నుంచి మ్యూజియం ఎదురుగా ఉన్న గోడమీద దర్జాగా కూర్చుంది. చిరుత కదలికలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. శ్రీవారి దర్శనం అనతరం లడ్డూ ప్రసాదం తీసుకుని భక్తులు బయటకు వచ్చే రోడ్డులోనే చిరుత తిరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయం తెలియడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఎటు నుంచి మీద పడుతుందోనని భయంతో వణికిపోతున్నారు.
Samayam Telugu తిరుమలలో చిరుత సంచారం


గతంలో కూడా తిరుమలలో జంతువుల సంచారం కనిపించింది. భక్తులు బసచేసే ప్రాంతాల్లో సంచరించాయి. చిరుత, ఎలుగుబంట్లు ఇటీవల ప్రత్యక్ష్యమయ్యాయి. అంతేకాదు ఓ చిరుత రెండో ఘాట్ రోడ్డులో వాహనదారులపై దాడికి దిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద చిరుత సంచారం అధికారులు, భక్తుల్లో కలవరపెట్టింది. అంతేకాదు తిరుపతిలో చిరుత కనిపించింది.. ఓ యువకుడిపై దాడి చేయడం కలకలంరేపింది. ఇప్పుడు మళ్లీ హల్చల్ చేయడంతో భక్తులు భయపడుతున్నారు. అటవీశాఖ అధికారులు కూడా నిఘా పెంచారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.