యాప్నగరం

TDP అధినేత చంద్రబాబు, లోకేష్‌లకు షాక్

అసెంబ్లీ సమావేశాలకు వెళుతుండగా.. మందడంలో జరుగుతున్న అభివృద్ధి వికేంద్రీకరణ దీక్షా శిబిరం వద్దకు రాగానే నిరసన సెగ తగిలింది. పెద్ద ఎత్తున మహిళలు నల్లజెండాలు ప్రదర్శిస్తూ చంద్రబాబు, లోకేశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Samayam Telugu 4 Dec 2020, 11:44 am
టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌లకు చేదు అనుభవం ఎదురైంది. అసెంబ్లీ సమావేశాలకు వెళుతుండగా.. మందడంలో జరుగుతున్న అభివృద్ధి వికేంద్రీకరణ దీక్షా శిబిరం వద్దకు రాగానే నిరసన సెగ తగిలింది. పెద్ద ఎత్తున మహిళలు నల్లజెండాలు ప్రదర్శిస్తూ చంద్రబాబు, లోకేశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాబు దళిత ద్రోహి అంటూ మండిపడ్డారు. ఒక రాజధాని వద్దు- మూడు రాజధానులు కావాలని ప్లకార్డులు చూపిస్తూ నినాదాలు చేశారు. అలాగే అమరావతిలో పేదల ఇళ్ల స్థలాలపై కోర్టులో వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం కూడా ఇలాగే నిరసన ఎదురైంది.
Samayam Telugu locals and womens protest against chandrababu and lokesh at mandadam on three capitals
TDP అధినేత చంద్రబాబు, లోకేష్‌లకు షాక్


ఏపీకి అభివృద్ధి వికేంద్రీకరణకై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయానికి పలువురు మద్దతు తెలుపుతున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా మందడంలో దీక్షాశిబిరం ఏర్పాటు చేశారు.పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్నారు. ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా కొందరు అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.