యాప్నగరం

తిరుపతి పరిధిలో లాక్‌డౌన్.. నిబంధనలు ఇలా

20కన్నా ఎక్కువగా కేసులు ఉన్న 18 డివిజన్లలో నేటి నుంచి పూర్తిస్థాయి లాక్‌డౌన్‌‌ను అమలు చేయనున్నారు. ఉదయం 11 గంటల వరకే నిత్యావసరాలు, కూరగాయల దుకాణాలకు అధికారులు అనుమతిని ఇచ్చారు. మద్యం షాపులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.

Samayam Telugu 15 Jul 2020, 9:58 am
చిత్తూరు జిల్లాలో కరోనా పంజా విసురుతోంది. ముఖ్యంగా తిరుపతిలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.. నగరంలోనే ఏకంగా వెయ్యికిపైగా కేసులు ఉన్నాయి. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.. 20కన్నా ఎక్కువగా కేసులు ఉన్న 18 డివిజన్లలో నేటి నుంచి పూర్తిస్థాయి లాక్‌డౌన్‌‌ను అమలు చేయనున్నారు. ఆ డివిజన్లు (1, 4, 5, 6, 7, 9, 10, 13, 14, 15, 28, 29,30,31,35, 36, 37, 38)గా ఉన్నాయి. ఉదయం 11 గంటల వరకే నిత్యావసరాలు, కూరగాయల దుకాణాలకు అధికారులు అనుమతిని ఇచ్చారు. అత్యవసరమైన, మెడికల్ ఎమర్జెన్సీ, మద్యం షాపులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.
Samayam Telugu తిరుపతి


నగరంలోని మిగిలిన డివిజన్లలో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే దుకాణాలు తెరవొచ్చు. తిరుపతి సమీపంలో ఉన్న పంచాయతీల్లోనూ చర్యలు తీసుకున్నారు. మొదటి విడతగా తిరుపతి గ్రామీణ మండలంలో 20 కంటే ఎక్కువ కేసులు నమోదైన అవిలాల, తిరుచానూరు, పద్మావతిపురం, శెట్టిపల్లి పంచాయతీలను గుర్తించి నేటి నుంచి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.