యాప్నగరం

కర్ణాటక నుంచి నిండు గర్భిణి ప్రయాణం.. 130 కి.మీ. నడిచిన తర్వాత..

లాక్ డౌన్ కష్టకాలంలో ఎలాగైనా ఇంటికి చేరుకోవాలనే పట్టుదలతో ఓ నిండు గర్భిణి కర్ణాటక నుంచి ప్రకాశం జిల్లా పొదిలికి పయనమైంది. ఆమెకు అనంతపురం పోలీసులు సహాయం అందించారు.

Samayam Telugu 3 May 2020, 11:15 pm
కరోనా వైరస్ (కోవిడ్ 19) మహమ్మారి కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుండగా వలస కూలీలు ఇళ్లకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన తరుణంలో మరో హృదయవిదాయకర ఘటన వెలుగులోకి వచ్చింది. లాక్‌డౌన్‌ వేళ కాలినడకన స్వస్థలానికి బయల్దేరిన నిండు గర్భిణి అస్వస్థతకు గురవడంతో అనంతపురం పోలీసులు సాయం అందించారు.
Samayam Telugu నిండు గర్భిణి సలోని


గర్భిణి తీవ్ర అస్వస్థతకు గురికావడం గుర్తించిన అధికారులు.. ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి ఆమెతో పాటు ఇతర కుటుంబ సభ్యులను కూడా స్వస్థలాలకు పంపించారు. కర్ణాటకలోని చెళ్లికెర ప్రాంతానికి ప్రకాశం జిల్లా పొదిలి నుంచి సలోని అనే మహిళ కుటుంబం వలస కూలీలు వెళ్లారు. అయితే లాక్ డౌన్ నిబంధనలను కాస్త సడలించిన నేపథ్యంలో నిండు గర్భిణిగా ఉన్న సలోని ఎలాగైనా ఇంటికి చేరుకోవాలనే పట్టుదలతో వారి స్వస్థలమైన ప్రకాశం జిల్లా పొదిలికి కాలినడకన బయల్దేరారు.

అయితే 130 కి.మీ నడిచిన తర్వాత గర్భిణి అస్వస్థతకు గురికావడంతో పోలీసులు ఆమెకు ఆశ్రయం కల్పించారు. సలోని చేతిలో రెండేళ్ల పాప కూడా ఉండటం చూడటంతో వారి మనసు కరిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ ఉద్యోగి పద్మావతి.. వారికి ప్రత్యేక వాహనం ఏర్పాటు చేశారు. ఆ వాహనానికి ఈ-పాస్‌ అనుమతి జారీ చేసి పొదిలికి తరలించారు. లాక్‌డౌన్‌ వేళ సక్రమంగా విధులు నిర్వర్తించడమే కాకుండా, వారికి అవసరమైన సాయం అందించి మానవత్వం చాటుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.