యాప్నగరం

తిరుపతి వెళ్లేవారికి అలర్ట్.. ఆగస్టు 14 వరకు!

తిరుపతిలో మళ్లీ లాక్‌డౌన్ కొనసాగింపు. ఇప్పటి వరకు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే షాపులకు అనుమతి ఉండేది ఇక నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతి ఉంటుంది.

Samayam Telugu 5 Aug 2020, 4:51 pm
తిరుపతికి వెళ్లేవారికి అలర్ట్.. కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు‌ పొడిగిస్తున్నట్లు తిరుపతి మున్సిపల్‌ కమిషనర్‌ గిరీష తెలిపారు. ఈనెల 14 వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందన్నారు. ఇప్పటి వరకు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే షాపులకు అనుమతి ఉండేదని ఇక నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతి ఉంటుందన్నారు. కరోనా లక్షణాలు లేని వారు పరీక్షలకు రావొద్దని కోరారు.
Samayam Telugu తిరుపతిలో ఆంక్షలు


ఆగస్టు 5 వరకు తిరుపతిలో అత్య‌వ‌స‌ర సేవ‌లు, మెడిక‌ల్ షాపులు మిన‌హా మిగ‌తా షాపులు ఉద‌యం 6 గంట‌ల నుంచి 11 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉంది. ఆ తర్వాత వాహ‌నాల‌కు కూడా అనుమ‌తించ లేదు.. క‌రోనా వైరస్‌ తీవ్ర‌త అధిక‌మ‌వుతున్నందున ప్ర‌తి ఒక్క‌రూ నిబంధ‌న‌లు పాటించాల‌ని అధికారులు ప్ర‌తీ ఒక్క‌రూ విధిగా నిబంధ‌న‌లను పాటించి స‌హ‌క‌రించాల‌న్నారు.

మరోవైపు తిరుపతిలో ఆంక్ష‌ల స‌మ‌యంలో ప్రైవేటు వాహ‌నాల‌కు న‌గ‌రంలోనికి ఆగస్టు 5 వరకు అనుమ‌తి లేదు. ఒకవేళ ప్రైవేటు వాహ‌నాల్లో తిరుమ‌ల‌కు వెళ్లేవారు బైపాస్ రోడ్ మార్గం ద్వారా వెళ్లాల‌ని ఎస్పీ సూచించారు. ఇక బైకులు సైతం ఒక్క‌రికే అనుమ‌తి ఉంటుందన్నారు. నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే జ‌రిమానాలు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.