యాప్నగరం

నెల్లూరు: ఇసుకలో బయటపడ్డ పురాతన ఆలయం.. పెద్ద చరిత్రే ఉంది

స్థానిక యువకులు ఆలయాన్ని బయటకు తీయాలని భావించారు. కరోనా, లాక్‌డౌన్ కారణంగా యువకులు ఊరికి వచ్చారు.. అధికారుల దగ్గర అనుమతి తీసుకున్నారు. అందరూ చందాలు వేసుకుని మంగళవారం యంత్రాలతో ఇసుక తొలగించారు.

Samayam Telugu 17 Jun 2020, 12:11 pm
నెల్లూరు జిల్లాలో పురాతన ఆలయం బయటపడింది. ఇసుకలో గ్రామస్థులు తవ్వకాలు జరిపి వెలికితీశారు. నెల్లూరు జిల్లాలోని చేజర్ల మండలం పెరుమాళ్లపాడు సమీపంలో పెన్నా నది ఒడ్డున ఇసుక మేటల ధాటికి 80ఏళ్ల కిందటే నది నుంచి రెండు మైళ్లు దూరం జరిగింది. అయితే 200ఏళ్ల నాగేశ్వరాలయం మాత్రం అక్కడే ఉంది.. అది కూడా తర్వాత కనిపించకుండా ఇసుక మేట వేసింది. గ్రామ ప్రజలు ఎప్పటి నుంచో ఆ ఆలయం వెలికి తీయాలని అనుకున్నారు.
Samayam Telugu నెల్లూరు ఆలయం


ఈ విషయం తెలుసుకున్న స్థానిక యువకులు ఆలయాన్ని బయటకు తీయాలని భావించారు. కరోనా, లాక్‌డౌన్ కారణంగా యువకులు ఊరికి వచ్చారు.. అధికారుల దగ్గర అనుమతి తీసుకున్నారు. అందరూ చందాలు వేసుకుని మంగళవారం యంత్రాలతో ఇసుక తొలగించారు.. ఆ మేటల కింద పరశురాముడు ప్రతిష్ఠిత నాగేశ్వరస్వామికి వేమన కుటుంబీకులు నిర్మించిన ఆలయం బయటపడింది. 200 ఏళ్ల క్రితం దీనిని నిర్మించారని చెబుతున్నారు. ఈ దేవాలయాన్ని పరశురాముడు ప్రతిష్టించారంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.