యాప్నగరం

చిత్తూరు: ఇంటర్‌లో ప్రేమ.. 10 రోజుల నుంచి మిస్సింగ్.. చెట్టుకు వేలాడిన జంట

10 రోజుల క్రితం కనిపించకుండా పోయిన ప్రేమజంట. అటవీ ప్రాంతంలో చెట్టుకు వేలాడారు. ఇంటర్ చదువుతున్న విద్యార్థిని.. ఆటో నడుపుతున్న యువకుడు.. చిత్తూరు జిల్లాలో ఘటన.

Samayam Telugu 28 Feb 2020, 8:47 pm
చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. సోమల అటవీ ప్రాంతంలో ప్రేమజంట ఆత్మహత్య కలకలంరేపింది. శుక్రవారం సాయంత్రం అటవీ ప్రాంతంలో ప్రేమజంట చెట్టుకు వేలాడుతుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. మృతుల వివరాలనపై ఆరా తీశారు.. దీంతో కొత్త ట్విస్ట్ బయటపడింది. 10 రోజుల క్రితం కనిపించకుండా పోయిన జంటగా గుర్తించారు.
Samayam Telugu File photo
File photo


పది రోజుల క్రితం ఇంటర్ విద్యార్థిని హేమలత, ఆటో డ్రైవర్ ముని కనిపించకుండా పోయారు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే.. అటవీ ప్రాంతంలో శవాలై కనిపించారు. వీరిద్దరూ కొద్దిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు పెళ్లికి ఒప్పుకోరనే భయంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ప్రేమజంట ఆత్మహత్యతో రెండు కుటుంబాల్లో విషాదచాయలు అలముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.