యాప్నగరం

విజయవాడ: హోటల్‌లో విషం తాగిన ప్రేమ జంట.. యువతి మృతి

విజయవాడలో ప్రేమజంట ఆత్మహత్య కలకలం. హోటల్‌లో విషం తాగిన ప్రేమజంట.. ప్రియురాలు మృతి , ప్రియుడు పరిస్థితి విషమం. ఓ ప్రైవేట్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తన్న యువతి.

Samayam Telugu 20 Dec 2019, 8:00 am
విజయవాడలో విషాద ఘటన జరిగింది. గాంధీనగర్‌లో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం కలకలంరేపింది. జగపతి హోటల్‌లో ప్రేమజంట గదిని అద్దెకు తీసుకోగా.. ఎంతసేపటికి బయటకు = రాకపోవడంతో అనుమానం వచ్చింది. వెంటనే హోటల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా తలుపులు పగులగొట్టి చూశారు. ఈ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు గుర్తించారు.
Samayam Telugu vja


ఈ ఘటనలో ప్రియురాలు గౌతమి అక్కడికక్కడే చనిపోగా.. అపస్మారక స్థితిలో ఉన్న ప్రియుడు లోకేష్‌ను వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. మృతురాలు ఓ ప్రైవేట్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ప్రియుడు లోకేష్‌ గుడివాడకు చెందిన యువకుడిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

జంట ఆత్మహత్య కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. గౌతమి, లోకేష్‌ల కుటుం సభ్యుల నుంచి వివరాలను ఆరా తీస్తున్నారు. అలాగే హోటల్‌కు ఎప్పుడు వచ్చారు.. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. హోటల్ సిబ్బందిని కూడా ప్రశ్నిస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.