యాప్నగరం

చీఫ్ సెక్రటరీ బాధ్యతలు అప్పగించాక.. ఎల్వీ సుబ్రహ్మణ్యం కీలక నిర్ణయం!

ఏపీ తాత్కాలిక చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్‌కు ఎల్వీ సుబ్రహ్మణ్యం బాధ్యతలు అప్పగించారు. అనంతరం నూతన బాధ్యతల్లో చేరకుండానే సెలవు మీద వెళ్లారు.

Samayam Telugu 6 Nov 2019, 6:23 pm
ఏపీ చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేసిన జగన్ సర్కారు.. ఆయన స్థానంలో భూ పరిపాలన విభాగం చీఫ్ కమిషనర్‌గా ఉన్న నీరబ్ కుమార్‌కు తాత్కాలిక బాధ్యతలను అప్పగించింది. బుధవారం ఉదయం నీరబ్ కుమార్‌కు ఎల్వీ సుబ్రహ్మణ్య బాధ్యతలు అప్పగించారు. కానీ తనకు అప్రాధాన్యమైన పదవిని కేటాయిచడం పట్ల ఎల్వీ సుబ్రమణ్యం అలకబూనారు. బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించకుండానే ఆయన తన ఉద్యోగానికి సెలవు పెట్టారు.
Samayam Telugu lvs1


ఎల్వీ సుబ్రహ్మణ్యం నవంబర్ 6 నుంచి డిసెంబర్ 6 వరకు.. నెల రోజులపాటు సెలవు మీద వెళ్లారు. ఆయన పదవీ కాలం మరో ఐదు నెలల్లో ముగియనుంది. కాగా ఎల్వీ బదిలీ వ్యవహరం పట్ల కేంద్రం సీరియస్‌గా ఉందని.. ఆయనకు కేంద్రంలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Read Also: జగన్ జీతం రూపాయి.. కిటికీలకు రూ.73 లక్షలు..

ఏపీ సీఎంవోలో చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న ప్రవీణ్ ప్రకాశ్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఎల్వీని బదిలీ చేస్తున్నట్టు ప్రవీణ్ ప్రకాశ్ పేరిట ఆదేశాలు జారీ అయ్యాయి.

Read Also: జగన్‌ను టార్గెట్ చేసిన మాజీ సీఎస్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.