యాప్నగరం

బాలయ్య బాటలో చిన్నల్లుడు.. మూడు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం

Nandamuri Balakrishna | బాలయ్య చిన్నల్లుడు మతకుమిల్లి శ్రీ భరత్ మంచి మనసు చాటుకున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 1.25 కోట్ల విరాళం అందజేశారు.

Samayam Telugu 3 Apr 2020, 4:15 pm
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం విద్యా సంస్థల చైర్మన్ మతకుమిల్లి శ్రీ భరత్ మంచి మనసు చాటుకున్నారు. దేశం మొత్తం కరోనాతో విలవిల్లాడుతున్న వేళ.. మామ బాటలో భారీ విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చిన ఆయన.. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.25 లక్షలు, కర్ణాటక సీఎం రిలీఫ్ ఫండ్‌కు మరో రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చారు. మొత్తం కోటి రూపాయలను ఆయన విరాళం ఇచ్చారు.
Samayam Telugu m sri bharat


నందమూరి బాలకృష్ణ కూడా రూ.1.25 కోట్ల విరాళం అందించారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 50 లక్షలు విరాళం ప్రకటించిన ఆయన.. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షలు ఇచ్చారు. సినీ కార్మికులకు సాయం కోసం ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీకి రూ.25 లక్షలను బాలయ్య విరాళంగా ఇచ్చారు.

మంత్రి కేటీఆర్‌కు బాలయ్య రూ.50 లక్షల చెక్‌ను అందజేయగా.. ఆయన వెంట శ్రీ భరత్ కూడా ఉన్నారు. అటు మావయ్యా, ఇటు అల్లుడు ఇద్దరూ తమ వంతుగా సీఎం రిలీఫ్ ఫండ్‌లకు విరాళం అందించడం పట్ల బాలయ్య ఫ్యాన్స్, టీడీపీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గత లోక్ సభ ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన భరత్.. వైఎస్సార్సీపీ అభ్యర్థి చేతిలో ఓడారు. జనసేన నుంచి పోటీ చేసిన జేడీ లక్ష్మీనారాయణకు కూడా భారీగా ఓట్లు పడటంతో.. టీడీపీ ఓటు బ్యాంకు చీలిపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.