యాప్నగరం

జగనన్నా.. ఆ మంత్రి కక్ష సాధిస్తున్నారు.. ఆర్‌ఎంవో సంచలన వ్యాఖ్యలు

మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో ఆర్‌ఎంవో విజయ నిర్మల నిరాహార దీక్ష. తనపై మంత్రి కక్షసాధిస్తున్నారని ఆరోపణలు.. ఏకపక్షంగా తనను విధుల నుంచి తొలగించారంటున్న ఆర్‌ఎంవో.

Samayam Telugu 4 Nov 2019, 1:39 pm
ఏపీ మంత్రి పేర్ని నానిపై మహిళా ఆర్‌ఎంవో విజయనిర్మల సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై మంత్రి కక్ష సాధిస్తున్నారంటూ నిరాహార దీక్షకు దిగారు. తప్పుడు ఫిర్యాదుతో ఎలాంటి విచారణ జరపకుండానే తనను ఏకపక్షంగా విధుల నుంచి తొలగించారని చెబుతున్నారు. అందుకే దీక్షకు దిగానని.. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదంటున్నారు.
Samayam Telugu rmo


నిజాయితీగా పనిచేసినందుకు ఇచ్చే బహుమతి ఇదేనా అంటూ విజయ నిర్మల ప్రశ్నించారు. తాను ఏం తప్పు చేశానని కక్ష సాధిస్తున్నారో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికైనా స్పందించి.. తన సమస్యను పరిష్కరించాలని.. తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు. సీఎం మహిళలకు ఎంతో గౌరవం ఇస్తున్నారు, ఎన్నో చేస్తున్నారని చెబుతున్నారని.. తనకు ఇచ్చిన గౌరవం ఇదా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
మచిలీపట్నం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో విజయ నిర్మల ఇంఛార్జ్ ఆర్‌ఎంవోగా విధులు నిర్వహిస్తున్నారు. స్థానిక మంత్రి పేర్ని నాని అనుచరులు, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ విభాగానికి చెందిన కొందరు నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో.. ఎలాంటి విచారణ లేకుండానే విధుల నుంచి తొలగించారని ఆరోపిస్తున్నారు. కనీసం తనకు వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వలేదని ఆమె అంటున్నారు. విజయ నిర్మల మచిలీపట్నం ఆస్పత్రి ప్రాంగణంలో విజయ నిర్మల దీక్ష చేయగా.. టీడీపీ నేతలు సర్థిచెప్పి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆమెతో దీక్ష విరమింపజేశారు. ఆర్‌ఎంవో దీక్షపై మంత్రి స్పందించాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.