యాప్నగరం

సీఎం జగన్‌‌ను ఫాలో అవుతున్న మహారాష్ట్ర సర్కార్

దిశ చట్టంపై అధ్యయం చేసేందుకు ఈ నెల 20న హైదరాబాద్ వస్తున్నట్లు మహారాష్ట్ర మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించారు.

Samayam Telugu 17 Feb 2020, 11:45 pm
మహిళలకు భద్రత కల్పించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఫాలో కావాలని మహారాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన ‘దిశ’ చట్టాన్ని తమ రాష్ట్రంలోనూ అమలు చేయాలని మహారాష్ట్ర డిసైడైంది. ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన ‘దిశ’ చట్టంపై అధ్యయనం చేసేందుకు ఫిబ్రవరి 20న హైదరాబాద్ వస్తున్నట్లు మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించారు.
Samayam Telugu jagan


Also Read: బీజేపీకి మాజీ మంత్రి గంటా భారీ షాక్

ఈ మేరకు సోమవారం సాయంత్రం ట్వీట్ చేశారు. మహిళలపై అత్యాచారాలను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ’ చట్టాన్ని అధ్యయనం చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. మహిళలపై అత్యాచారాలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

ఈ చట్టం ప్రకారం.. మహిళలు, చిన్నారులపై ఎవరైనా అఘాయిత్యాలకు పాల్పడితే 21 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి దోషులను శిక్షించవచ్చు. ఈ బిల్లులను రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించినా ఇంకా పూర్తిస్థాయిలో చట్టం కాలేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే దిశ చట్టం అధికారికంగా అమలులోకి వస్తుంది. అయినప్పటికీ ఈ చట్టంపై పలు రాష్ట్రాలు ఆసక్తి చూపుతుండటం గమనార్హం.

Also Read: పీకే అంటే పిచ్చి కుక్క, అచ్చెన్న అచ్చోసిన ఆంబోతు.. వైసీపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.