యాప్నగరం

కృష్ణాజిల్లా: శవాల్ని వదలని మార్చురీ అటెండర్.. ఇదేం కక్కుర్తి బాబోయ్

రూ.6వేలు ఇస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తానని తేల్చి చెప్పాడు. అత డబ్బు ఇవ్వలేమని బతిమాలినా వినలేదు.. డబ్బులు ఇవ్వందే అప్పగించేది లేదన్నాడు. చివరకు రూ.1500 ఇచ్చారు.

Samayam Telugu 25 Aug 2020, 10:34 am
కృష్ణజిల్లా మచిలీపట్నంలో అమానవీయ ఘటన బయటపడింది. ఆస్పత్రి మార్చురీలో మృతదేహాన్ని అప్పగించడానికి ఓ అటెండర్ లంచం డిమాండ్ చేశాడు. డెడ్ బాడీని ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. కూతురు చనిపోయి బాధలో ఉన్న ఆ తల్లిదండ్రులు లంచం ఇవ్వక తప్పలేదు. మచిలీపట్నంలో ఈ నెల 21న సుమలత అనే మహిళను భర్త దారుణంగా హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు.
Samayam Telugu మచిలీపట్నంలో దారుణం


కూతురి డెడ్‌బాడీని స్వాధీనం చేసుకునేందుకు తల్లిదండ్రులు ఆస్పత్రి మార్చురీ దగ్గరకు వెళ్లారు. అక్కడ మార్చురీ అటెండర్ వారికి ఓ షాకిచ్చాడు. రూ.6వేలు ఇస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తానని తేల్చి చెప్పాడు. అత డబ్బు ఇవ్వలేమని బతిమాలినా వినలేదు.. డబ్బులు ఇవ్వందే అప్పగించేది లేదన్నాడు. చివరకు రూ.1500 ఇచ్చారు. ఈ లంచం ఇచ్చే సమయంలో అటెండర్ వ్యవహారాన్ని వీడియో తీసి వైరల్ చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. అటెండర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.