యాప్నగరం

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు.. బందర్ యువకుడి అరెస్టు

ఏపీ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టి యువకుడు జైలు పాలయ్యాడు. కృష్ణా జిల్లాకు చెందిన మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Samayam Telugu 13 Sep 2019, 12:25 pm
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై ఏపీ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను కించపరిచే విధంగా కామెంట్లు పెడితే కటకటాల వెనక్కి నెట్టేస్తున్నారు. అలాంటి సంఘటనే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది. జిల్లాకు చెందిన ఓ మంత్రి, మరో మాజీ ప్రజాప్రతినిధిపై బూతు కామెంట్లు పెట్టిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
Samayam Telugu pjimage (49)


Also Read :బాబు గారు.. మరో చెత్త సినిమా వదిలారు.. విజయసాయి

కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఇనగుదురు పేటకి చెందిన నవాజ్ కొద్దికాలంగా సోషల్ మీడియాలో ప్రభుత్వం, మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని)పై అసభ్యకర పోస్టులు పెడుతున్నాడు. మచిలీపట్నం మున్సిపల్ మాజీ చైర్మన్ సిలార్ దాదాపై బూతు పోస్టులు చేశాడు. అవి కాస్తా వైరల్ కావడంతో విషయం సీరియస్ అయింది. ప్రజాప్రతినిధులను కించపరుస్తూ పోస్టింగ్‌లు పెడుతున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నవాజ్‌‌ను అరెస్టు చేసి కటకటాల వెనక్కినెట్టారు.

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నా మార్పు కనిపించడం లేదు. సీఎం వైఎస్ జగన్‌పై అభ్యంతరకర రీతిలో పోస్టులు పెట్టిన తెలంగాణ వాసిని ఆగస్టులో ఏపీ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. వైఎస్సార్సీపీ మహిళా ఎమ్మెల్యేలు రోజా, రజనిలపై అసభ్యకర పోస్టులు పెట్టినందుకు పలువురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.