యాప్నగరం

అక్రమ సంబంధం: భార్యను కిరాతకంగా చంపేశాడు.. దర్జాగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి..

వేరొకరితో అక్రమ సంబంధం నెరుపుతోందన్న అనుమానంతో భార్యను అత్యంత దారుణంగా భర్త హత్య చేసిన సంఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. హత్యానంతరం జంకూబొంకూ లేకుండా నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లడం సంచలనం కలిగించింది.

Samayam Telugu 19 Nov 2019, 6:38 pm
కట్టుకున్న భార్యను కిరాతకంగా అంతమొందించాడో కసాయి భర్త. అనంతరం తాపీగా నడుచుకుంటూ పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన ఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలో కలకలం రేపింది. భార్యపై అనుమానంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. రోకలిబండతో తలపై విచక్షణా రహితంగా కొట్టడంతో భార్య అక్కడికక్కడే చనిపోయింది. తెల్లవారుజామున నిద్రపోతున్న సమయంలో కొట్టి చంపేసినట్లు సమాచారం.
Samayam Telugu mgl1 (1).


భార్యను రోకలిబండతో మోది హత్య చేసిన ఘటన మంగళగిరిలో అలజడి రేపింది. పట్టణంలోని ఆటో నగర్ సమీపంలోని రాజీవ్ గృహకల్ప సముదాయంలో కొణతాల శ్రీనివాసరావు, జ్యోతి దంపతులు నివాసం ఉంటున్నారు. గత కొద్దికాలంగా భార్య ప్రవర్తనపై శ్రీనివాసరావు అనుమానం పెంచుకున్నాడు. వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్యను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.

Also Read: మందుబాబులకు ఇక మోతే.. జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం

రోకలిబండతో తలపై కొట్టి భార్య జ్యోతిని దారుణంగా చంపేశాడు. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో జ్యోతి తలపై బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. అనంతరం శ్రీనివాసరావు ఐదు గంటల సమయంలో మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయినట్లు తెలుస్తోంది. స్టేషన్‌కి వచ్చి తన భార్యను చంపేశానని చెప్పడంతో కంగుతిన్న పోలీసులు.. వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మంగళగిరి పట్టణ సీఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: మందు తాగి లారీ ఎక్కిన డ్రైవర్.. విజయవాడలో బీభత్సం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.