యాప్నగరం

హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్తున్నారా.. ఈ-పాస్‌లతో జాగ్రత్త!

ఏపీకి వచ్చేందుకు కావల్సిన ఈ-పాస్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.. ఎవరైనా సరే స్పందన యాప్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని చెబుతున్నారు.

Samayam Telugu 7 Jul 2020, 8:24 am
హైదరాబాద్ లాక్‌డౌన్ ప్రచారం, కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణతో పాటూ ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి జనాలు క్యూ కడుతున్నారు. కేంద్రం లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చినా జగన్ సర్కార్ మాత్రం రాష్ట్రానికి రావాలంటే పాస్ ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. స్పందన యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. అది కూడా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకే సరిహద్దులో చెక్‌పోస్టు దగ్గర అనుమతిస్తున్నారు. దీంతో పాస్‌ల కోసం జనాల దరఖాస్తుల వెల్లువలా వస్తున్నాయి.
Samayam Telugu ఏపీ ఈ-పాస్‌లు


Read Also: జగన్ సర్కార్ చెర నుంచి తిరుమలకు విముక్తి.. రమణ దీక్షితులు సంచలన ట్వీట్

ఈ ఈ-పాస్‌‌ల పేరుతో కొందరు జనాలకు టోపీ పెడుతున్నారు కొందరు కేటుగాళ్లు. ఇలా ఓ కేటుగాడు ఏకంగా 73మందిని మోసం చేశాడు. పాస్‌ల పేరుతో బురిడీ కొట్టించాడు. ప్రకాశం జిల్లాకు చెందిన మందా పవన్ కుమార్ హైదరాబాద్ ఉప్పల్‌లో ఓ కన్సల్టెన్సీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తెలంగాణ నుంచి ఆంధ్రాకు వచ్చేందుకు డీజీపీ ఆఫీస్ నుండి ఈపాస్‌లు జారీ చేస్తుంటారు. పవన్ కుమార్ ఈ పాస్‌ల పేరుతో నకిలీ ఈపాస్‌లను సృష్టించాడు. అమాయకుల నుంచి డబ్బు వసూలు చేశాడు.

Also Read: పేదలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. ఆగస్టు 15న పక్కా!

నెల్లూరు, ప్రకాశం జిల్లాకు చెందిన 73 మందికి అమాయకులకు ఫేక్ ఈ పాస్‌లను తయారు చేసి ఇచ్చాడు. మోసపోయినవారి ద్వారా ఈ విషయం కృష్ణాజిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబుకి తెలిసింది. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకునేందుకు స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేసి.. డేకాయ్ ఆపరేషన్ ద్వారా ఎర వేసి పట్టుకున్నారు. పాస్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.. ఎవరైనా సరే స్పందన యాప్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని.. ఇలాంటి మాయగాళ్ల మాయలో పడొద్దంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.