యాప్నగరం

విశాఖలో విషాదం.. కరోనా వచ్చిందని యువకుడి ఆత్మహత్య కానీ..

ఇంట్లో అందరికీ జ్వరం వచ్చింది. అంతా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అనంత్ రిపోర్టు తప్పా అందరి రిపోర్టులు వచ్చేశాయి. దీంతో తనకు కరోనా సోకిందేమోనని భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Samayam Telugu 24 Aug 2020, 8:50 am
కరోనా వైరస్ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. కరోనా వచ్చిందని కొందరు...రాకుండా భయంతోనే మరికొందరు ప్రాణాలు బలితీసుకుంటున్నారు. తమలో ఏపాటి లక్షణాలు కనిపిస్తున్నా భయంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. సాధారణ జ్వరం, జలుబు దగ్గు వచ్చిన కరోనా వచ్చిందన్న భయంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా విశాఖపట్నంలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. కరోనా భయంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో అంతా నిద్రపోతున్న సమయంలో ఉరివేసుకొని చనిపోయాడు. తీరా రిపోర్ట్‌లో మాత్రం నెగెటివ్ అని వచ్చింది. దీంతో అతని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
Samayam Telugu కరోనా భయంతో ఆత్మహత్య
corona fear suicide


విశాఖపట్నం జిల్లాలో ఈ ఘటన జరిగింది. చినగదిలి బీసీ కాలనీకి చెందిన ఆకిన వసంతకుమార్ కుటుంబంలో అందరూ అనారోగ్యానికి గురయ్యారు. ఇటీవల అందరికి జ్వరం వచ్చింది. దీంతో కరోనా అని భయపడిపోయాడు. వెంటనే అంతా పరీక్షలు చేయించుకునేందుకు ఈ నెల 18న శాంపిల్స్ కూడా ఇచ్చారు. జ్వరంబారిన పడడంతో 18న కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ముగ్గురి రిపోర్ట్ రాగా అతని రెండో కుమారుడు హరికృష్ణ(27) రిపోర్ట్‌ రాలేదు.
Read More: విశాఖవాసులకు అలర్ట్.. ఏటీఎంల ద్వారా నయా దోపిడీ
దీంతో తనకు కరోనా సోకిందేమోననే అనుమానంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. కరోనా వస్తే తన పరిస్థితి ఏంటో అని తీవ్రంగా తల్లడిల్లిపోయాడు. ఇంట్లో అంతా నిద్రపోతున్న సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అనంత రిపోర్టు ఆలస్యంగా వచ్చింది. అందులో అతనికి నెగిటివ్ అని తేలింది. దీంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. భయంతోనే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.