యాప్నగరం

పక్కింటమ్మాయిని చూశాడని.. ప్రకాశంలో దారుణం

ఫోన్ మాట్లాడుకుంటూ మిద్దెపైకి వెళ్లాడు యువకుడు. పక్కింటమ్మాయిని చూశాడంటూ గొడవకు దిగి తీవ్రంగా కొట్టడంతో భయాందోళనకు గురై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

Samayam Telugu 1 Jan 2021, 2:25 pm
పక్కింటమ్మాయిని చూశాడని ఆమె కుటుంబ సభ్యులు గొడవపడ్డారు. ఆమె అన్న స్నేహితులతో కొట్టించాడు. తీరా విషయం పోలీస్ స్టేషన్‌కి కూడా చేరడంతో అవమానం తట్టుకోలేక పోయిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ అత్యంత విషాద ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది. కనిగిరి పట్టణంలోని మంగలి మాన్యానికి చెందిన రామక్రిష్ణ(22) తన ఇంటిపై ఫోన్ మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో పక్కింటమ్మాయిని చూశాడంటూ ఆమె తల్లి ఘర్షణకు దిగింది. తన చెల్లెలి వైపు చూశాడంటూ ఆమె అన్న తన స్నేహితులతో దారుణంగా కొట్టించాడు. చంపేస్తానని బెదిరించాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
suicide


అమ్మాయి వ్యవహారంలో పోలీస్ స్టేషన్‌కి వెళ్లాల్సి రావడంతో అవమానంగా ఫీలైన రామక్రిష్ణ డిసెంబర్ 12న ఆత్మహత్యాయత్నం చేశాడు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. శరీరం కాలిపోయి తీవ్రగాయాలపాలైన రామక్రిష్ణని ఒంగోలు.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు 30న మృతి చెందాడు. మృతదేహాన్ని కనిగిరి తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు రామక్రిష్ణ మృతికి కారణమైన నిందితులను తక్షణం అరెస్టు చేయాలంటూ ఆందోళనకు దిగారు. వారికి ప్రజాసంఘాల నేతలు సంఘీభావం తెలిపి నిరసన చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.