యాప్నగరం

ప.గో: క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తికి కత్తి గుచ్చుకుని మృతి

హోం క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తి మృతి. ఇంట్లో కూరగాయలు కోస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ గుండె పైభాగంలో గుచ్చుకున్న కత్తి. 108లో ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయిన వ్యక్తి. 13 రోజులుగా హోం క్వారంటైన్‌లో ఉంటున్న భార్యాభర్తలు.

Samayam Telugu 1 Apr 2020, 12:07 pm
పశ్చిమగోదావరి జిల్లాలో విషాద ఘటన జరిగింది. హోం క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తికి ప్రమాదవశాత్తూ కత్తి గుచ్చుకోవడంతో చనిపోయాడు. చింతలపూడి మండలం రాఘవాపురంకు చెందిన ఓ వ్యక్తి ప్రభుత్వ ఆదేశాలతో భార్యతో కలిసి హోం క్వారంటైన్‌లో ఉంటున్నాడు. ఉదయం భార్యకు సాయం చేసేందుకు ఉదయం ఇంట్లో కూరగాయలు కోస్తున్నాడు. మధ్యలో ఏదో అవసరం ఉండటంతో వంటింట్లోకి వెళ్లి తిరిగి వస్తున్నాడు.
Samayam Telugu man died in home quarantine at west godavari district
ప.గో: క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తికి కత్తి గుచ్చుకుని మృతి


ఆయన తిరిగి వచ్చే క్రమంలో ప్రమాదవశాత్తూ కాలు జారి కిందపడిపోయాడు. వెంటనే కింద ఉన్న కత్తి గుండె భాగంలో గుచ్చుకుంది.. వెంటనే అతడికి ప్రాథమిక చికిత్స చేసేందుకు ప్రయత్నించారు. కానీ రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి తరలించేందుకు 108కు సమాచారం ఇచ్చారు. అయితే అప్పటికే అతడు చనిపోయినట్లు 108 సిబ్బంది తేల్చారు. భార్యాభర్తలు ఇద్దరు గత 13 రోజులుగా హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం డీఎస్పీ, అతడి కుమారుడు, పని మనిషికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తండ్రీకొడుకులు ఇటీవల గ్రామంలో జరిగిన ఓ గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. వారికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఈ కార్యక్రమానికి హాజరైన 90మంది స్థానికుల్ని హోంక్వారంటైన్‌లో ఉంచారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిన అతడు చనిపోయాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.