యాప్నగరం

జగన్‌పై అభిమానం.. 55 సెంట్ల భూమి దానం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పథకాలు చూసి.. ఆయనపై అభిమానంతో ఈ భూమిని పద్మనాభ చౌదరి ఇచ్చారట. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పథకాలు చూసి.. ఆయనపై అభిమానంతో ఈ భూమిని పద్మనాభ చౌదరి ఇచ్చారట.

Samayam Telugu 11 Aug 2020, 10:49 am
జగన్‌పై అభిమానంతో ఓ వ్యక్తి 55 సెంట్ల భూమిని దానంగా ఇచ్చారు. అధికారులు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో అండగా నిలిచారు. విజయనగరం జిల్లా భోగాపురంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం నిర్మాణానికి స్థలం దొరకలేదు. అధికారులకు ఏం చేయాలో అర్ధం కాలేదు. అలాంటి సమయంలో నేనున్నానంటూ అదే గ్రామానికి చెందిన పద్మనాభచౌదరి ముందుకు వచ్చారు. తన భూమిని ఇవ్వడానికి ఒప్పుకున్నారు.. 55 సెంట్ల భూమిని ప్రభుత్వానికి దానంగా ఇచ్చేశారు.
Samayam Telugu సీఎం జగన్


ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పథకాలు చూసి.. ఆయనపై అభిమానంతో ఈ భూమిని పద్మనాభ చౌదరి ఇచ్చారట. కొంచెంం స్థలం ఉంటే కమర్షియల్‌గా ఆలోచించే రోజుల్లో మహేంద్రతనయ ప్రవహించే విలువైన సారవంతమైన భూమిని ఉచితంగా అందించారు. ప్రభుత్వానికి భూమిని దానం చేసిన ఆయన్ను అందరూ అభినందిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.