యాప్నగరం

ఏపీ హోంమంత్రి పేరుతో యువకుడి మోసాలు

ఏపీ హోంమంత్రి సుచరిత ఫొటోను తన వాట్సాప్‌ ఫ్రొఫైల్‌కు పెట్టుకుని అందర్నీ బురిడీ కొట్టించాడు. సీన్ కట్ చేస్తే మోసం బయటపడి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.

Samayam Telugu 22 May 2020, 9:33 am
ఏపీ హోంమంత్రి పేరుతో మోసాలకు పాల్పడ్డాడో యువకుడు. సుచరిత ఫొటోను తన వాట్సాప్‌ ఫ్రొఫైల్‌కు పెట్టుకుని అందర్నీ బురిడీ కొట్టించాడు. సీన్ కట్ చేస్తే మోసం బయటపడి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. గుంటూరు ఎస్‌వీన్‌ కాలనీకి చెందిన శరత్‌చంద్ర వరప్రసాద్‌.. పెదకాకాని ఆటోనగర్‌ వై జంక్షన్‌ దగ్గరున్న ఇసుక డంపింగ్‌ యార్డులో డేటా ప్రాసెసింగ్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. తనను హోంమంత్రికి బాగా పరిచయస్తుడిగా నమ్మించేందుకు పెద్ద ప్లాన్ వేశాడు.
Samayam Telugu యువకుడి మోసాలు


వరప్రసాద్ తన ఫోన్‌ నంబర్‌కు ట్రూకాలర్‌లో హోంమంత్రి సుచరిత ఫొటోను మార్చేశాడు. తాను హోం మినిస్టర్‌ ఆఫీస్‌‌ వ్యక్తినని అందరికి నమ్మబలికాడు. ఆటోనగర్‌ డంపింగ్‌ యార్డులో ఇసుక రవాణా మొత్తం తన కన్నుసన్నలలోనే నడుస్తుందని చెప్పాడు. చాలామందికి ఇదే మాట చెప్పడంతో నమ్మారు. ఇలా చాలామందిని మోసగించాడు. కొద్దిరోజులుగా ఇసుక తరలింపులో అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు.

ఈ క్రమంలో వరప్రసాద్ మోసానికి బలైన పెదకాకానికి చెందిన బండ్లమూడి భానుకిరణ్‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుతో నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇసుక తరలింపులో అతడు మోసాలకు పాల్పడినట్లు.. అక్రమంగా వసూళ్లు చేశాడని పోలీసులు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.