యాప్నగరం

విశాఖ: ఫోన్‌లో మాట్లాడుతుండగా అనుకోని ప్రమాదం.. పాపం ప్రాణాలు పోయాయి

కన్నయ్య అనే వ్యక్తి స్థానికంగా ఉన్న ఓ బావి దగ్గర నిలబడి కాల్ మాట్లాడుతుండగా పొరపాటున సెల్‌ఫోన్‌ జారింది.. పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. బావిలోకి జారిపడిపోతున్న ఫోన్‌ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తూ..

Samayam Telugu 27 Jul 2020, 10:09 am
విశాఖ జిల్లాలో విషాద ఘటన జరిగింది. మొబైల్ పట్టుకోబోయి ప్రమాదవశాత్తూ బావిలో పడిపోవడంతో ఓ వ్యక్తి ప్రాణాలు పోయాయి. గాజువాక పెదనడుపూరుకు చెందిన కన్నయ్య అనే వ్యక్తి స్థానికంగా ఉన్న ఓ బావి దగ్గర నిలబడి కాల్ మాట్లాడుతుండగా పొరపాటున సెల్‌ఫోన్‌ జారింది.. పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. బావిలోకి జారిపడిపోతున్న ఫోన్‌ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తూ కన్నయ్య ప్రమాదవశాత్తూ బావిలో పడిపోయాడు.. కొద్దిసేపటికే ప్రాణాలు పోయాయి.
Samayam Telugu విశాఖపట్నంలో విషాదం


కన్నయ్య బావిలో పడిపోయాడని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకి చేరుకున్నారు.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాపం ఫోన్ మాట్లాడుతూ మొబైల్ పడిపోవడంతో అతడి ప్రాణాలు పోయాయి. కన్నయ్య మరణంతో స్థానికంగా విషాద వాతావరణం కనిపించింది. అప్పటి వరకు తమ ముందు ఉత్సాహంగా తిరిగిన అతడు ఇక లేడని తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.